More
    Homeజిల్లాలుకామారెడ్డిPaddy centers | తరుగు పేరిట దోపిడీ.. నష్టపోతున్న రైతులు

    Paddy centers | తరుగు పేరిట దోపిడీ.. నష్టపోతున్న రైతులు

    Published on

    అక్షరటుడే, నిజాంసాగర్/ఎల్లారెడ్డి : Paddy centers | ఆరుగాలం కష్టపడి పంట పండించిన అన్నదాతలను (farmer) మిల్లర్లు తరుగు పేరిట దోపిడీ చేస్తున్నారు. ప్రభుత్వాలు (governament) మారినా.. అధికారులు పర్యవేక్షణ చేస్తున్నా.. ఈ దోపిడీ మాత్రం ఆగడం లేదు. ప్రతీ సీజన్​లో మిల్లర్లు రైతులను మోసం (millers cheat farmers every season) చేస్తూనే ఉన్నారు. అయినా అధికారులు మాత్రం చర్యలు చేపట్టడం లేదు.

    నిజాంసాగర్ మండలం మాగి, లింగంపేట మండలం అయ్యపల్లి, షెట్పల్లి, లింగంపేట, మెంగారం తదితర గ్రామాల్లో (nizamsagar mandal, magi village) స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రం (paddy purchase center) నుంచి ఇప్పటివరకు 30కి పైగా లారీలు మిల్లులకు తరలించారు. నిర్వాహకులు తాలు లేకుండా మిషన్​ పట్టించాలనడంతో రైతులు (farmer) చెమటోడ్చి మిషన్​ పట్టారు. ఇలా శుద్ధి చేస్తే 40 కిలోల బస్తాకు అదనంగా 1.7 కేజీలు తూకం వేస్తే సరిపోతుందని నిర్వాహకులు చెప్పినప్పటికీ.. రైతులకు మాత్రం లాభం జరగట్లేదు.

    READ ALSO  Rain Alert | తెలంగాణకు భారీ వర్ష సూచన

    Paddy centers | చేతులు ఎత్తేస్తున్న నిర్వాహకులు

    కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు (purchasing center managers) చెప్పినట్లు తూకం వేసినా మిల్లర్లు మళ్లీ కోత పెడుతున్నారు. లేదంటే లారీలో నుంచి ధాన్యం దించుకోవడం లేదు. క్వింటాకు అదనంగా మూడు కిలలో తరుగు తీస్తున్నారు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు (farmers are suffering serious losses). జిల్లాలోని చాలా ప్రాంతాల్లో తరుగు దోపిడీ కొనసాగుతోంది. దీనిపై నిర్వాహకులను ప్రశ్నిస్తే.. మిల్లుకు తమ ధాన్యం చేరిన తర్వాత అక్కడ ఓకే చేసే వరకు రైతులదే బాధ్యత అని చెబుతున్నారు.

    Paddy centers | రూ.20 వేలు నష్టపోయా..

    –‌‌ మాటూరు శ్రీనివాస్, రైతు, మాగీ

    మిషన్​ పట్టించి కొనుగోలు కేంద్రంలో ధాన్యం విక్రయించా. తూకం సమయంలో బస్తాకు 41.7 కిలోలు జోకారు. మిల్లుకు తీసుకెళ్లిన తర్వాత మళ్లీ క్వింటాలుకు మూడు కిలోల చొప్పున కోత పెట్టారు. దీంతో మొత్తం రూ.20 వేల వరకు నష్టపోయా. అధికారులు స్పందించి తరుగు తీయకుండా చూడాలి.

    READ ALSO  Navodaya schools | గుడ్​న్యూస్​.. ప్రారంభం కానున్న నవోదయ పాఠశాలలు

    Paddy centers | లారీకి 15 సంచులు కట్ చేశారు..

    – పిట్ల గంగారాం, రైతు అయ్య పల్లి, లింగంపేట

    లారీకి 15 సంచులు తరుగు పేరుతో మిల్లర్ కట్ చేశారు. ఐకేపీ సీసీతో మాట్లాడితే తొమ్మిది సంచులకు డీల్ చేశారు. లారీ డ్రైవర్ కు సంచికి రూపాయి, తాడు గుంజే వ్యక్తికి సంచికి మరో రూపాయి చొప్పున రైతులు చెల్లించి ధాన్యం తరలిస్తున్నారు. దోపిడి అరికట్టడంలో అధికారులు విఫలమవుతున్నారు.

    Paddy centers | రూ.60 వేల వరకు నష్టం..

    – అంజయ్య, రైతు మాగి

    కొనుగోలు కేంద్రానికి ధాన్యాన్ని తీసుకెళ్తే 1,400 బస్తాలు అయ్యాయి. తరుగు పేరిట రైస్​ మిల్లర్లు క్వింటాలుకు 3 కిలోల చొప్పున కోత విధించారు. దీంతో సుమారు రూ.60 వేల వరకు నష్టపోతున్నాను. అసలే అప్పులు తీసుకొచ్చి పంటలు సాగు చేస్తుంటే రైస్​మిల్లర్లు దోచుకుంటున్నారు. ఇప్పటికైనా అధికారులు సంధించి చర్యలు తీసుకోవాలి

    READ ALSO  MLC Kavitha | రేవంత్​రెడ్డి అసమర్థ సీఎం.. ఎమ్మెల్సీ కవిత

    Latest articles

    Air India flight | ఎయిర్ ఇండియా ప్రయాణికులకు షాక్​.. టేకాఫ్​ అయ్యాక వెనక్కి మళ్లిన ఫ్లైట్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Air India flight : ఢిల్లీ నుంచి రాంచీకి బయలుదేరిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాన్ని...

    Navodaya schools | గుడ్​న్యూస్​.. ప్రారంభం కానున్న నవోదయ పాఠశాలలు

    అక్షరటుడే, హైదరాబాద్: Navodaya schools : తెలంగాణలో 7 నవోదయ విద్యాలయాలు ప్రారంభంకానున్నాయి. ఈ మేరకు నవోదయ విద్యాలయ...

    Israel – Iran War | యాంకర్ న్యూస్ చదువుతుండగా మిస్సెల్ అటాక్

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Israel - Iran War : ఇజ్రాయెల్ - ఇరాన్ దేశాల మధ్య పరస్పర దాడులు...

    Robert Vadra | మనీలాండరింగ్ కేసులో రాబర్ట్ వాద్రాకు ED సమన్లు.. ఆ రోజు విచారణకు రావాల్సిందే!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Robert Vadra : కాంగ్రెస్ పార్లమెంటు సభ్యురాలు(ఎంపీ) ప్రియాంక గాంధీ (Congress MP Priyanka Gandhi)...

    More like this

    Air India flight | ఎయిర్ ఇండియా ప్రయాణికులకు షాక్​.. టేకాఫ్​ అయ్యాక వెనక్కి మళ్లిన ఫ్లైట్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Air India flight : ఢిల్లీ నుంచి రాంచీకి బయలుదేరిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాన్ని...

    Navodaya schools | గుడ్​న్యూస్​.. ప్రారంభం కానున్న నవోదయ పాఠశాలలు

    అక్షరటుడే, హైదరాబాద్: Navodaya schools : తెలంగాణలో 7 నవోదయ విద్యాలయాలు ప్రారంభంకానున్నాయి. ఈ మేరకు నవోదయ విద్యాలయ...

    Israel – Iran War | యాంకర్ న్యూస్ చదువుతుండగా మిస్సెల్ అటాక్

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Israel - Iran War : ఇజ్రాయెల్ - ఇరాన్ దేశాల మధ్య పరస్పర దాడులు...