అక్షరటుడే, నిజాంసాగర్:Paddy Center | కొనుగోలు కేంద్రాల్లో హమాలీ(Porters)ల కొరత తీర్చాలని రైతులు కోరారు. వడ్డేపల్లి రైతులు(Farmers) మండలంలోని తహశీల్దార్ కార్యలయం(Tahsildar Office)లో ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రం(Purchasing Centers)లో హామాలీల కొరత కారణంగా కొనుగోళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యను పరిష్కరించాలని తహశీల్దార్ భిక్షపతి(Tahsildar Bikshapati)ని వారు కోరారు. కేంద్రంలో సమస్యలపై ఏపీఎంకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవట్లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు.