అక్షరటుడే, హైదరాబాద్:BRS Silver Jubilee | వరంగల్ బీఆర్ఎస్ రజతోత్సవ(BRS silver jubilee) సభకు వెయ్యి మంది విద్యార్థి, యువత పాదయాత్ర ప్రారంభించారు. సిద్దిపేట(Siddipet) నియోజకవర్గం రంగదాంపల్లి అమరవీరుల స్థూపం నుంచి విద్యార్థి, యువత పాదయాత్ర చేపట్టారు.
అమరవీరులకు నివాళులు అర్పించి, పహల్గాం ఉగ్రదాడి(Pahalgam Terrorist)లో మరణించిన వారికి 2 నిమిషాలు మౌనం వహించి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు(MLA Harish Rao) జెండా ఊపి పాదయాత్రను ప్రారంభించారు.