అక్షరటుడే, కామారెడ్డి: PDS Rice | పట్టణంలోని రాజీవ్నగర్ కాలనీలో అక్రమంగా తరలిస్తున్న 100 క్వింటాళ్లకు పైగా పీడీఎస్ బియ్యాన్ని సీసీఎస్ అధికారులు (CCS Officers) పట్టుకున్నారు. బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో రాజీవ్నగర్ కాలనీలో డీసీఎం వ్యాన్ను తనిఖీ చేశారు. వాహనంలో 240 బస్తాలు ఉన్నాయని.. సుమారు 110 నుంచి 120 క్వింటాళ్ల బియ్యం ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. డీసీఎంను సీజ్ చేసిన అధికారులు వ్యాన్తో పాటు డ్రైవర్ షేక్ అర్బాస్ను కామారెడ్డి పోలీస్స్టేషన్కు తరలించారు.
