అక్షరటుడే, వెబ్డెస్క్: Nara lokesh | అమరావతి సభలో ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వంద పాకిస్తాన్లు వచ్చినా భారత్ను ఏమీ చేయలేవన్నారు. పాకిస్తాన్ దేశం భారత్లో మొలిచిన గడ్డి కూడా పీలకలేదన్నారు. ఎందుకంటే మన వద్ద ‘నమో’ మిస్సైల్ ఉందని పేర్కొన్నారు. ప్రధాని మోదీ కొట్టే దెబ్బకు దిమ్మతిరగడం ఖాయమన్నారు.
Nara lokesh | ప్రధానికి ఏపీపై ప్రత్యేక అభిమానం
ప్రధాని నరేంద్ర మోదీకి ఆంధ్రప్రదేశ్ అంటే ప్రత్యేక అభిమానమని లోకేశ్ పేర్కొన్నారు. చంద్రబాబుపై కక్షతో గత ప్రభుత్వం అమరావతిని చంపేసిందని వ్యాఖ్యానించారు. అంతుకుముందు ప్రధాని మోదీ అమరావతిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.