More
    Homeఆంధ్రప్రదేశ్​YS Jagan | ఏడాదిలోనే ప్రభుత్వంపై వ్యతిరేకత : వైఎస్ జగన్​

    YS Jagan | ఏడాదిలోనే ప్రభుత్వంపై వ్యతిరేకత : వైఎస్ జగన్​

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: YS Jagan | కూటమి ప్రభుత్వంపై ఏడాదిలోనే ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చిందని మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్​ జగన్(YS Jagan)​ అన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పల్నాడు జిల్లా రెంటపాళ్లలో బుధవారం తన పర్యటన విజయవంతమైందని జగన్​ తెలిపారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని జగన్​ ఆరోపించారు. ప్రభుత్వంపై ఏడాదిలోనే తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్నారు. తక్కువ కాలంలో ఇంత వ్యతిరేకత ఏ ప్రభుత్వానికీ రాలేదని పేర్కొన్నారు. ప్రజల్లో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత కనిపించిందని ఆయన తెలిపారు.

    YS Jagan | నియంతలా మారిన చంద్రబాబు

    ఏపీ సీఎం చంద్రబాబు(AP CM Chandrababu) నియంతలా మారారని జగన్​ ఆరోపించారు. ఆయన తీరులో అసంతృప్తి కనిపిస్తోందని విమర్శించారు. అణచివేతకు నిదర్శనంగా చంద్రబాబు తయారయ్యారని సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ కార్యకర్తలను అడ్డుకోవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. పార్టీ కార్యకర్తలను పరామర్శించడం కూడా తప్పా అన్నారు.

    READ ALSO  AndhraPradesh | ఆంధ్రప్రదేశ్ ఏరోస్పేస్ & డిఫెన్స్ పాలసీ .. 15 వేల ఎకరాల సేకరణకు నిర్ణయం

    YS Jagan | ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే దాడులు చేస్తారా..

    ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే దాడులు చేస్తారా అని వైఎస్​ జగన్​ ప్రశ్నించారు. ఇటీవల సాక్షి కార్యాలయాలపై(Sakshi Office) దాడులను ఆయన ఖండించారు. టీడీపీ నాయకులు, ఎమ్మెల్యేలు దగ్గరుండి దాడులు చేశారని ఆరోపించారు.

    YS Jagan | తప్పుడు కేసులు పెడుతున్నారు

    కూటమి ప్రభుత్వంలో వైసీపీ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారని జగన్​ ఆరోపించారు. లిక్కర్​ స్కామ్(Liquor scam)​లో చెవిరెడ్డిని ఇరికించడానికి తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తున్నారన్నారు. చెవిరెడ్డి(Chevireddy) గన్‌మెన్‌ను బెదిరించి వాంగ్మూలం తీసుకున్నారని ఆయన పేర్కొన్నారు. చెవిరెడ్డి కుమారుడిని కూడా ఈ కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. పిన్నెల్లిపైనా తప్పుడు కేసులు పెట్టారని నందిగం సురేష్‌పైనా కేసుల మీద కేసులు పెడుతున్నారని జగన్​ ఆగ్రహం వ్యక్తం చేశారు.

    READ ALSO  Banakacharla Project | బనకచర్లకు అనుమతులు ఇవ్వొద్దు : సీఎం రేవంత్​రెడ్డి

    YS Jagan | పొదిలి పర్యటనలో ఇబ్బంది పెట్టారు

    ఇటీవల తన పొదిలి పర్యటనలో సైతం టీడీపీ నాయకులు(TDP Leaders) ఇబ్బందులు పెట్టారని వైఎస్​ జగన్​ అన్నారు. 40 వేల మంది వైసీపీ కార్యకర్తలు, రైతులపై 40 మంది టీడీపీ కార్యకర్తలు దాడి చేసి రెచ్చగొట్టారని ఆరోపించారు. అయినా రైతులు సంయమనం పాటించారని పేర్కొన్నారు. లేదంటే పరిస్థితి ఎలా ఉండేదో అర్థం చేసుకోవాలన్నారు. రైతులు సంయమనం పాటించినా వారిపైనే కేసులు పెట్టారని జగన్ పేర్కొన్నారు.

    Latest articles

    Forest land Encroachment | అటవీ భూముల కబ్జా.. యథేచ్ఛగా చెట్ల నరికివేత

    అక్షరటుడే, బాన్సువాడ : Forest land Encroachment | కొందరు పచ్చని చెట్లను నరికివేస్తున్నారు. అటవీ భూముల్లో (Forest...

    Maharashtra | ఇది క‌దా అస‌లైన బాండింగ్ అంటే..93 ఏళ్ల వయసులో భార్యకు మంగళసూత్రం.. ఫిదా అయిన షాపు య‌జ‌మాని

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Maharashtra | ఈ రోజుల్లో భ‌ర్త‌ని భార్య‌లు చంపుతుండ‌డం మ‌నం చూస్తూ ఉన్నాం. కాని కొన్ని జంట‌ల...

    Bhubarathi | భూభారతిలో సర్వేయర్ల పాత్ర ఎంతో కీలకం

    అక్షరటుడే, ఇందూరు: Bhubarathi | భూభారతి చట్టం అమలులో లైసెన్స్​డ్​ సర్వేయర్ల పాత్ర ఎంతో కీలకమని కలెక్టర్...

    Indiramma Houses | ఇందిరమ్మ ఇళ్లకు ఉచితంగా ఇసుక ఇవ్వాలి

    అక్షరటుడే, ఆర్మూర్: Indiramma Houses | ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు ఉచితంగా ఇసుక సరఫరా చేసేలా చొరవ చూపాలని...

    More like this

    Forest land Encroachment | అటవీ భూముల కబ్జా.. యథేచ్ఛగా చెట్ల నరికివేత

    అక్షరటుడే, బాన్సువాడ : Forest land Encroachment | కొందరు పచ్చని చెట్లను నరికివేస్తున్నారు. అటవీ భూముల్లో (Forest...

    Maharashtra | ఇది క‌దా అస‌లైన బాండింగ్ అంటే..93 ఏళ్ల వయసులో భార్యకు మంగళసూత్రం.. ఫిదా అయిన షాపు య‌జ‌మాని

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Maharashtra | ఈ రోజుల్లో భ‌ర్త‌ని భార్య‌లు చంపుతుండ‌డం మ‌నం చూస్తూ ఉన్నాం. కాని కొన్ని జంట‌ల...

    Bhubarathi | భూభారతిలో సర్వేయర్ల పాత్ర ఎంతో కీలకం

    అక్షరటుడే, ఇందూరు: Bhubarathi | భూభారతి చట్టం అమలులో లైసెన్స్​డ్​ సర్వేయర్ల పాత్ర ఎంతో కీలకమని కలెక్టర్...