అక్షరటుడే, వెబ్డెస్క్ : ISRO | పహల్గామ్ ఉగ్రదాడి pahalgam terror attack కి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ operation sindoor ను విజయవంతంగా నిర్వహించింది. ఉగ్రశిబిరాలను గుర్తించడంతో పాటు ఖచ్చితత్వంతో 9 టెర్రర్ క్యాంపులను పేల్చేసింది. ఇస్రో సాయంతో భారత్ ఈ ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేయగలిగింది. భారత ఉపగ్రహాలు పాక్లోని ఉగ్రవాద, సైనిక స్థావరాల గుర్తింపులో కీలక పాత్ర పోషించాయి. భారత ఆర్మీ అధికారులు మీడియాకు ఉపగ్రహ చిత్రాలను కూడా విడుదల చేశారు.
ISRO | కాపలా కాస్తున్న శాటిలైట్లు
ఆపరేషన్ సిందూర్ అనంతరం ఇరు దేశాల్లో ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరిన విషయం తెలిసిందే. ఉగ్రవాద క్యాంపులపై భారత్ దాడి చేస్తే, పాకిస్తాన్ భారత్పై డ్రోన్లు, యుద్ధ విమానాలు, లాంగ్ రేంజ్ క్షిపణులతో దాడి చేసింది. అయితే ఈ దాడులను గుర్తించడం, ప్రతిదాడులు చేయడంలో ఇస్రో isro పాత్ర కూడా ఉంది. ఆపరేషన్ సిందూర్ మొదలైన నాటి నుంచి రెండు దేశాల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో 10 ఉపగ్రహాలు satellites తీరప్రాంతాన్ని పర్యవేక్షించడానికి, రక్షించడానికి 24 గంటలు నిర్విరామంగా పనిచేస్తున్నాయని ఇస్రో ఛైర్మన్ వి నారాయణన్ (Isro Chairman Narayanan) తెలిపారు.
ISRO | ప్రజలను రక్షించడంలో కీలక పాత్ర
ఇస్రో శాటిలైట్లతో నిఘా పెట్టి కీలక సమాచారాన్ని భారత రక్షణశాఖకు Indian Defence అందించింది. ఈ డేటా ద్వారా పాక్ దాడులతో ప్రజల ప్రాణాలకు నష్టం వాటిల్లకుండా రక్షించగలిగామని ఇస్రో ఛైర్మన్ తెలిపారు. మణిపూర్లోని ఇంఫాల్లో జరిగిన సెంట్రల్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో ఆయన మాట్లాడారు. దేశంలోని 7,000 కిలో మీటర్ల సముద్ర తీరం, ఉత్తర భూభాగాలపై నిరంతరం నిఘా ఉంచాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. దేశ భద్రతకు ఇస్రో తీసుకుంటున్న చర్యలను ఆయన వివరించారు.
ISRO | త్వరలో మరో ప్రయోగం
దేశ రక్షణ, భద్రత అవసరాల దృష్ట్యా ఇస్రో మరో ప్రయోగం చేపట్టనుంది. ఇందుకోసం మే 18న శ్రీహరికోట sriharikota అంతరిక్ష కేంద్రం space center నుంచి ‘రిశాట్-1బి’ (EOS-09) అనే అత్యాధునిక రాడార్ ఇమేజింగ్ ఉపగ్రహాన్ని ప్రయోగించనుంది. ఈ శాటిలైట్తో ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా భూమిపై నిఘా పెట్టవచ్చు. భూ ఉపరితలాన్ని స్పష్టంగా ఫొటోలు తీయొచ్చు. ఈ ప్రయోగంతో భారత రక్షణ వ్యవస్థ మరింత పటిష్టం కానుంది. ముఖ్యంగా పాకిస్తాన్తో ఉద్రిక్తతల నేపథ్యంలో ఆ దేశంలో కదలికలపై నిఘా పెట్టడానికి ఈ ఉపగ్రహం ఎంతో పని చేయనుంది.