అక్షరటుడే, వెబ్డెస్క్ : Operation Sindoor | ఇండియన్ ఎయిర్ఫోర్స్ indian air force కీలక ప్రకటన చేసింది. ఆపరేషన్ సిందూర్ operation sindoor ఇంకా కొనసాగుతోందని ప్రకటించింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆదివారం ఉదయం పోస్ట్ చేసింది. కాగా ఆపరేషన్ సిందూర్ అనంతరం భారత్ – పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరాయి. పాక్ భారత్లోని పలు ప్రాంతాలపై దాడులు చేయగా భారత్ తిప్పి కొట్టింది. అనంతరం భారత్ ప్రతిదాడులు చేసింది. పాకిస్తాన్లోని ఎయిర్ బేస్లు, మిలటరీ స్థావరాలే లక్ష్యంగా భారత వైమానిక దళం దాడులు చేసింది.
Operation Sindoor | కాల్పుల విరమణ
ఉద్రిక్తతలు తగ్గించడానికి ఇరు దేశాల ఆర్మీ జనరల్స్ army generals చర్చించి కాల్పుల విరమణ ఒప్పందం చేసుకున్నారు. శనివారం సాయంత్రం ఐదు గంటల నుంచి కాల్పుల విరమణ ceasefire అమలులోకి వచ్చింది. అయితే ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాక్ శనివారం రాత్రి సరిహద్దులోని పలు ప్రాంతాలపై దాడులు చేసింది. ఈ క్రమంలో ఆపరేషన్ సిందూర్ ఇంకా కొనసాగుతోందని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రకటించడం గమనార్హం. తమకు అప్పగించిన పనులను విజయవంతంగా పూర్తి చేశామని, అత్యంత కచ్చితత్వం దాడులు చేశామని ఐఏఎఫ్ పేర్కొంది. ఆపరేషన్ సిందూర్పై తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని ఐఏఎఫ్ ట్వీట్ చేసింది.
Operation Sindoor | కాసేపట్లో ప్రకటన
ప్రధాని మోదీ (pm modi) తన నివాసంలో కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. ఆపరేషన్ సిందూర్, కాల్పుల విరమణ అంశంపై ఆయన రక్షణ శాఖ అధికారులతో చర్చిస్తున్నారు. ఈ క్రమంలో ఐఏఎఫ్ IAF ప్రకటన చేయడం గమనార్మం. ఉగ్రవాదంపై పోరు కొనసాగుతుందని చెప్పేలా ఇలా ట్వీట్ చేసిందా.. లేదా పాక్ దాడులకు ప్రతిదాడులు తప్పవనే ఉద్దేశంలో చేసిందా అని తెలియాల్సి ఉంది. దీని మరికొద్ది సేపట్లో రక్షణశాఖ, విదేశాంగ అధికారులు వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.
Operation Sindoor | అప్రమత్తంగా సైన్యం
కాల్పుల విరమణ అమలులోకి వచ్చిన భారత సైన్యం సరిహద్దుల్లో అప్రమత్తంగా ఉంది. భారీ ఆయుధాలు, గగనతల రక్షణ వ్యవస్థతో పహారా కాస్తోంది. పాక్ శనివారం రాత్రి దాడులు చేయడంతో మళ్లీ ఆ దేశం ఒప్పందాన్ని ఉల్లంఘించే అవకాశం ఉందని భావించిన కేంద్రం సైన్యానికి ఫుల్ పవర్స్ ఇస్తున్నట్లు ప్రకటించింది. దీంతో పాక్ మళ్లీ దాడులకు పాల్పడితే తగిన బుద్ధి చెప్పడానికి సైన్యం సన్నద్ధంగా ఉంది.