More
    HomeజాతీయంOperation Sindoor | ‘టెర్ర‌ర్ న‌ర్స‌రీ’గా ‘ముర్కిదే’.. ల‌ష్క‌రే తోయిబా ఇక్క‌డ నుండే ఆప‌రేష‌న్స్ చేస్తుందా..?

    Operation Sindoor | ‘టెర్ర‌ర్ న‌ర్స‌రీ’గా ‘ముర్కిదే’.. ల‌ష్క‌రే తోయిబా ఇక్క‌డ నుండే ఆప‌రేష‌న్స్ చేస్తుందా..?

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Operation Sindoor | ప‌హ‌ల్​గామ్​లో 26 మంది ప‌ర్యాట‌కుల‌ను పొట్ట‌న‌బెట్టుకున్న ఉగ్ర‌వాదుల‌కు భార‌త ఆర్మీ(Indian Army) గ‌ట్టిగా బ‌దులిచ్చింది. మంగ‌ళ‌వారం అర్ధ‌రాత్రి 1.44 గంట‌ల‌కు పాకిస్తాన్, పాక్ ఆక్ర‌మిత క‌శ్మీర్‌లోని 9 ఉగ్ర‌స్థావ‌రాల‌పై భార‌త సైన్యం మెరుపుదాడుల‌తో విరుచుకుప‌డ‌డంతో ఒక్క బహావల్‌పూర్‌(Bahawalpur)లోనే 30 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. అలాగే ఈ దాడుల్లో 100 మందికిపైగా టెర్రరిస్ట్‌లు హతమైనట్టు తెలుస్తోంది.

    Operation Sindoor | అర్ధ‌రాత్రి దాడులు..

    ప‌హ‌ల్​గామ్​ ఉగ్ర‌దాడి(Pahalgam Terror Attack) వెనుకాల ల‌ష్క‌రే తోయిబా ఉగ్ర‌వాద సంస్థ ఉన్న‌ట్లు భార‌త సైన్యం అనుమానించింది. దీంతో ఆ సంస్థ‌కు ప్ర‌ధాన స్థావ‌ర‌మైన ముర్కిదేను భార‌త సైన్యం(Indian Army) ల‌క్ష్యంగా చేసుకుంది. పాకిస్తాన్‌లోని ప్ర‌ధాన వాణిజ్య కేంద్ర‌మైన లాహోర్‌కు 40 కిలోమీట‌ర్ల దూరంలో ముర్కిదే ఉంది. ముర్కిదేలో 200 ఎక‌రాల్లో ల‌ష్క‌రే తోయిబా త‌న ఉగ్ర‌స్థావ‌రాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు సమాచారం. ల‌ష్క‌రే తోయిబా అనుబంధ సంస్థ జ‌మ్మ‌త్ ఉద్ దావా(Jammat-ud-Dawa) కూడా ఇక్క‌డి నుంచే త‌న కార్య‌క‌లాపాలు కొన‌సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలను భారత్‌ India ధ్వంసం చేసింది.

    READ ALSO  Covid Test | ప్రధానిని కలవాలంటే కోవిడ్​ టెస్ట్​ చేయించుకోవాల్సిందే..

    ముర్కిదే ప్రాంతం టెర్ర‌ర్ న‌ర్స‌రీ(Terror Nursery)గా పేరుగాంచింది. ఈ క్యాంపును 200 ఎక‌రాల్లో విస్త‌రించి, ఉగ్ర‌వాద శిక్ష‌ణా కార్యకలాపాల‌ను కొన‌సాగిస్తున్నట్లు సమాచారం. ఇది ల‌ష్క‌రే తోయిబా ఉగ్ర‌వాద సంస్థ‌కు ముర్కిదే ఒక న‌ర్వ్(నాడీ) సెంట‌ర్‌గా పేరుగాంచింది. ఇక్కడే అయితే 80 నుంచి 90 మంది దాకా టెర్ర‌రిస్టులు Terrorists చ‌నిపోయిన‌ట్లు తెలుస్తోంది. యుద్ధంలో పాల్గొన్న ఫైటర్‌ జెట్‌లు, పైలట్లు భారత్‌కు సేఫ్‌గా తిరిగివచ్చారు. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో ఐదు ప్రాంతాలే లక్ష్యంగా దాడులు జరిపింది. బ‌హ‌వ‌ల్‌పూర్ జైషే మ‌హ్మ‌ద్, ముర్కిదేలోని ల‌ష్క‌రే తోయిబా ఉగ్ర‌వాద స్థావరాల‌ను ధ్వంసం చేసినట్లు సమాచారం. కాగా.. ‘ఆపరేషన్ సింధూర్‌’(Operation Sindhoor)ను భారత ప్రధాని నరేంద్రమోదీ(Prime Minister Narendra Modi) స్వయంగా పర్యవేక్షించారు. వార్‌రూమ్‌ నుంచి లైవ్‌లో వీక్షించినట్లు తెలుస్తోంది. కాగా.. నేడు 11 గంటలకు CCS కీలక భేటీ జరగనుంది. అనంతరం కేంద్ర కేబినెట్ సమావేశం జరుగనుంది.

    READ ALSO  Payal Shankar | రాష్ట్రానికి చేయూతనిచ్చిన కేంద్రం

    Latest articles

    Ex Mla Jeevan Reddy | కాంగ్రెస్‌ కక్ష సాధింపులకు పరాకాష్ట

    అక్షరటుడే, ఆర్మూర్‌: Ex Mla Jeevan Reddy | ఫార్ములా–ఈకార్‌ రేస్‌ అక్రమ కేసులో ఏసీబీ విచారణకు కేటీఆర్‌కు...

    Rapido driver | మ‌హిళా ప్రయాణికురాల‌పై చేయి చేసుకున్న ర్యాపిడో డ్రైవ‌ర్.. నిల‌దీసినందుకేనా?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rapido driver | కర్ణాటక రాజధాని బెంగళూరులో (Bangalore) ఓ మహిళా కస్టమర్‌ను.. ర్యాపిడో...

    Raitu Vedika | రైతువేదికల్లో వీడియో కాన్ఫరెన్స్​ సౌకర్యం ప్రారంభం

    అక్షరటుడే, ఆర్మూర్‌: Raitu Vedika | రైతునేస్తంలో భాగంగా ప్రభుత్వం అన్ని రైతువేదికల్లో వీడియో కాన్ఫరెన్స్‌ పరికరాలు ఏర్పాటు...

    Bhubarathi | భూభారతి దరఖాస్తులను పెండింగ్​లో పెట్టొద్దు

    అక్షరటుడే,బోధన్: Bhubarathi | భూభారతి దరఖాస్తును ఎట్టిపరిస్థితుల్లో పెండింగ్​లో ఉంచవద్దని బోధన్​ సబ్​ కలెక్టర్​ వికాస్​ మహతో (Sub-Collector...

    More like this

    Ex Mla Jeevan Reddy | కాంగ్రెస్‌ కక్ష సాధింపులకు పరాకాష్ట

    అక్షరటుడే, ఆర్మూర్‌: Ex Mla Jeevan Reddy | ఫార్ములా–ఈకార్‌ రేస్‌ అక్రమ కేసులో ఏసీబీ విచారణకు కేటీఆర్‌కు...

    Rapido driver | మ‌హిళా ప్రయాణికురాల‌పై చేయి చేసుకున్న ర్యాపిడో డ్రైవ‌ర్.. నిల‌దీసినందుకేనా?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rapido driver | కర్ణాటక రాజధాని బెంగళూరులో (Bangalore) ఓ మహిళా కస్టమర్‌ను.. ర్యాపిడో...

    Raitu Vedika | రైతువేదికల్లో వీడియో కాన్ఫరెన్స్​ సౌకర్యం ప్రారంభం

    అక్షరటుడే, ఆర్మూర్‌: Raitu Vedika | రైతునేస్తంలో భాగంగా ప్రభుత్వం అన్ని రైతువేదికల్లో వీడియో కాన్ఫరెన్స్‌ పరికరాలు ఏర్పాటు...