అక్షరటుడే, వెబ్డెస్క్ : Operation Sindoor | ఉగ్రవాదులు భారత్ వైపు కన్నెత్తి చూస్తే వారికి నూకలు చెల్లినట్లేనని సీఎం రేవంత్రెడ్డి (CM revanth reddy) అన్నారు. పహల్గామ్ ఉగ్రదాడికి (pahalgam terror attack) ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్కు (operation sindoor) సంఘీభావంగా గురువారం హైదరాబాద్లో ర్యాలీ (rally on hyderabad) నిర్వహించారు. సెక్రటేరియట్ నుంచి ఇందిరా గాంధీ విగ్రహం (Secretariat to indira gandhi statue) వరకు ర్యాలీ తీశారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి (CM revanth reddy), మంత్రులు (ministers), ఉన్నతాధికారులు, మాజీ ఆర్మీ అధికారులు (former army officers)పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. జవాన్లకు స్ఫూర్తి ఇవ్వడానికే ఈ ర్యాలీ అన్నారు. వీర జవాన్లకు అండగా నిలబడేందుకు వచ్చిన ప్రజలకు ఆయన అభినందనలు తెలిపారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న వారికి ఆయన హెచ్చరికలు జారీ చేశారు.
Operation Sindoor | పాక్ లేకుండా చేస్తాం..
భారత్పై ఎవరైనా దాడి చేస్తే వదలబోమని సైన్యం చాటి చెప్పిందన్నారు. భారత్ వైపు కన్నెత్తి చూస్తే నూకలు చెల్లినట్లేనని ఆయన అన్నారు. నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలు వీర సైనికులకు అండగా ఉంటారని సీఎం రేవంత్రెడ్డి (CM revanth reddy) అన్నారు. రాజకీయాలు, పార్టీలకతీతంగా సైన్యానికి మద్దతుగా నిలవాలన్నారు. పాకిస్తాన్కు స్వాతంత్ర్యం ఇప్పించింది కూడా మహాత్మా గాంధీనే (Mahatma Gandhi gave independence to pakistan) అని సీఎం అన్నారు. ఆయన స్ఫూర్తితో భారత్ శాంతి కాంక్షిస్తుంటే.. దానిని చేతకానితనంగా పాక్ భావిస్తోందన్నారు. వారికి బుద్ధి చెప్పడానికి భారత్ ఆపరేషన్ సిందూర్ (india launch operation sindoor) చేపట్టిందన్నారు. భారత సైన్యం (indian army) తలచుకుంటే రాత్రికి రాత్రే పాకిస్తాన్ గల్లంతు అవుతుందని ముఖ్యమంత్రి అన్నారు. భారత్పై దాడులు చేయాలని చూస్తే ప్రపంచ పటంలో నుంచి పాక్ను మాయం చేస్తామన్నారు.