అక్షరటుడే, వెబ్డెస్క్ : Operation Sindoor | ఆపరేషన్ సింధూర్ ద్వారా.. భారత్ తాను ఏం చేయగలదో ఉగ్రవాదులతో పాటు, దాయదీ దేశానికి చాటి చెప్పింది. ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించేదిలేదని ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత్ స్పష్టం చేసింది.
భారత్ గతంలోలా కాకుండా ఉగ్రదాడి జరిగిన ప్రతిసారీ తీవ్రంగా స్పందిస్తుండటంతో దాయాదీ దేశం తలలు పట్టుకుంటోంది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ప్రతీకారం కోసం చూస్తున్న భారత్ ఎట్టకేలకు మంగళవారం అర్ధరాత్రి పీవోకేతో పాటు, పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలపై వైమానిక దాడులు చేసింది. ఉగ్రదాడులు చేస్తే తగిన బుద్ధి చెబుతామని తెలిసేలా భారత్ ఇటీవల దాడులు చేస్తుంది. ఆపరేషన్ సింధూర్ operation sindoor పేరిట చేసిన ఈ దాడుల్లో పలువురు ఉగ్రవాదులు మరణించినట్లు సమాచారం. మొత్తం ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేసినట్లు భారత రక్షణ శాఖ difence ministry వర్గాలు తెలిపాయి.
Operation Sindoor | అప్పుడు సరిహద్దు దాటి
జమ్మూ కశ్మీర్లోని ఉరిలో భారత ఆర్మీ స్థావరంపై 2016 సెప్టెంబర్ 18న జైషే – మహ్మద్ ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ ఘటనలో 19మంది సైనికులు అమరులయ్యారు. ఉగ్రవాదులకు బుద్ది చెప్పేందుకు అదే ఏడాది సెప్టెంబర్ 28న రాత్రి భారత ఆర్మీ నియంత్రణ రేఖను దాటి ఉగ్రవాద శిబిరాలపై సర్జికల్ స్ట్రైక్ నిర్వహించింది.
Operation Sindoor | ఎయిర్స్ట్రైక్స్తో సమాధానం
జమ్మూ కశ్మీర్లోని పుల్వామలో భారత సీఆర్పీఎఫ్ బలగాల కాన్వాయ్పై 2019 ఫిబ్రవరి 14న ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడి చేశారు. ఈ ఘటనలో 40 మంది సైనికులు మృతి చెందారు. దీనికి ప్రతీకారంగా భారత్ 2019 ఫిబ్రవరి 26న పీవోకేలోని బాలకోట్, చకోతిలోని ఉగ్రవాద స్థావరాలపై వైమానిక దాడులు చేసింది. తాజాగా పహల్గామ్ దాడికి ప్రతిచర్యగా పీవోకేతో పాక్లోకి చొచ్చుకెళ్లి మరి దాడులు చేయడం గమనార్హం.