అక్షరటుడే, వెబ్డెస్క్: Anil Kumar Eravathri | కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఆపరేషన్ కగార్ను నిలిపేయాలని రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ఛైర్మన్ ఈరవత్రి అనిల్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ (Hyderabad)లోని సీపీఐ కార్యాలయంలో(CPI Office) శాంతి చర్చల కమిటీ ఆధ్వర్యంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీది మొదటి నుంచి గాంధేయవాదమేనన్నారు. 50 ఏళ్లలో కాంగ్రెస్ హయాంలో హింసాత్మక ఘటనలు జరిగిన దాఖలాలు లేవన్నారు. మావోయిస్టుల చేతుల్లో చాలామంది కాంగ్రెస్ నేతలు మృతి చెందారని.. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఎలాంటి మారణహోమానికి దిగలేదని స్పష్టం చేశారు.
Anil Kumar Eravathri | నంబాల కేశవరావు పట్ల దారుణంగా వ్యవహరించడం సరికాదు
బడుగు బలహీనవర్గాల సామాజిక న్యాయం కోసం సీపీఐ(మావోయిస్టు) ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు (Nambala Kesava Rao) తన జీవితాంతం పోరాడారని ఈరవత్రి అనిల్ పేర్కొన్నారు. అలాంటి వ్యక్తిని కాల్చి చంపి, మృతదేహాన్ని కూడా కుటుంబ సభ్యులకు అప్పగించకుండా బీజేపీ ప్రభుత్వం(BJP government) దారుణంగా వ్యవహరించిందన్నారు. మావోయిస్టులు పేదల పక్షాన పోరాటం చేశారే తప్ప దేశాన్ని విచ్ఛినం చేసేందుకు కాదని స్పష్టం చేశారు.