అక్షరటుడే, బోధన్: Sub Collector Vikas Mahato | రెవెన్యూ సదస్సులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో (Bodhan Sub-Collector Vikas Mahato) సూచించారు. సాలూరా(saloora) మండలం మందర్నా(Mandarna) గ్రామంలో కొనసాగుతున్న గ్రామ రెవెన్యూ సదస్సులను మంగళవారం ఆయన తనిఖీ చేశారు. భూములకు సంబంధించి ఎలాంటి సమస్యలున్నా స్థానిక తహశీల్దార్కు దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించాలని తహశీల్దార్ శశిభూషణ్కు సూచించారు. అనంతరం పోతంగల్ మండలంలోని తగ్గెల్లిలో కొనసాగుతున్న గ్రామ సదస్సులను కూడా సబ్కలెక్టర్ పరిశీలించారు. అలాగే మండలంలోని నాగంపల్లిలో తహశీల్దార్ విఠల్, సాలూర మండలంలో తహశీల్దార్ శిశుభూషణ్ దరఖాస్తులను స్వీకరించారు.

నాగంపల్లిలో దరఖాస్తులు స్వీకరిస్తున్న తహశీల్దార్ విఠల్