అక్షరటుడే,గాంధారి:Gandhari Police | విద్యుత్షాక్(Electric Shock)తో ఒకరికి గాయాలు కాగా.. పోలీసు సిబ్బంది(gandhari police) స్పందించి అతడి ప్రాణాలు కాపాడారు. వివరాల్లోకి వెళ్తే.. గాంధారి మండలంలోని సాయిలు టీ పాయింట్ వద్ద ఉన్న బోరు మోటార్(Boru Motor) వద్ద పరమళ్ల తండాకు చెందిన సక్రం అనే వ్యక్తి నీరు తాగేందుకు వెళ్లగా ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలి కిందపడ్డాడు.
వెంటనే స్థానికులు గమనించి పోలీసులకు(Police) సమాచారం అందించగా.. కానిస్టేబుళ్లు కిషన్గౌడ్, సందీప్ స్పందించి బాధితుడు సక్రంను ఆటోలో గాంధారి ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రి(Kamareddy Government Hospital)కి తరలించినట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు. స్పందించిన పోలీసు సిబ్బందిని సీఐ సంతోష్కుమార్ ci santhosh kumar అభినందించారు.