అక్షరటుడే నిజామాబాద్ సిటీ:Nizamabad | లారీ ఢీకొనడంతో ఓ వృద్ధుడు మృతి చెందిన ఘటన నిజామాబాద్ నగరంలో చోటు చేసుకుంది.
పోలీసులు(Police) తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ నగరంలోని దుబ్బ చౌరస్తా(Dubba Chowrastha) వద్ద బుధవారం ఉదయం నడుచుకుంటూ వెళుతున్న సుంకరి నర్సయ్య(68)ను వెనుక నుంచి లారీ ఢీకొంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఆయనను స్థానికులు జిల్లా జనరల్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నర్సయ్య మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు మూడో టౌన్ ఎస్సై హరిబాబు(3 Town SI Haribabu) తెలిపారు.