అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad City | ప్రమాదవశాత్తు రైలు కిందపడి ఓ యువకుడు మృతి చెందిన ఘటన నిజామాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో జరిగింది. రైల్వే పోలీసుల కథనం ప్రకారం.. నగరంలోని శాంతినగర్ కు చెందిన అబ్దుల్ వాజీద్ (29) రైలులో ప్రయాణిస్తుండగా, అర్సపల్లి గేట్ సమీపంలో ప్రమాదవశాత్తు రైలు నుంచి జారీ పడి మృతి చెందాడు. ఈ మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు.
