అక్షరటుడే, ఇందూరు: Nizamabad City | నగర శివారులోని పలు కాలనీల్లో అక్రమ నిర్మాణాలపై మున్సినల్ కార్పొరేషన్ అధికారులు చర్యలు తీసుకున్నారు. ధర్మపురి హిల్స్(Dharmapuri Hills), కోజా కాలనీలో(Koja Colony) గల ప్రభుత్వ స్థలాల్లో కొందరు నిర్మాణాలు చేపట్టారు. దీంతో ఆర్డీవో రాజేంద్ర కుమార్(RDO Rajendra Kumar) ఆదేశాలతో గురువారం పోలీస్, రెవెన్యూ, నగరపాలక సంస్థ అధికారుల సమక్షంలో వాటిని కూల్చివేశారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రభుత్వస్థలంలో ఎటువంటి నిర్మాణాలు చేపట్టినా చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
