అక్షరటుడే, వెబ్డెస్క్: Thug Life : సినీ నటుడు కమల్ హాసన్(Film actor Kamal Haasan)కు సుప్రీంకోర్టు(Supreme Court)లో ఊరట కలిగింది. ఆయన నటించిన చిత్రం ‘థగ్ లైఫ్’ విడుదలకు అనుమతించాలని కర్ణాటక(Karnataka) ప్రభుత్వానికి సూచించింది. భాషా వివాదం నేపథ్యంలో కర్ణాటక(Karnataka)లో థగ్లైఫ్ సినిమా విడుదలను నిలిపి వేయడంపై సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. దీన్ని విచారించిన సుప్రీం ధర్మాసనం.. సిద్దరామయ్య ప్రభుత్వం(Siddaramaiah government)పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
సినిమా విడుదలకు అనుమతించాలని సూచించిన న్యాయస్థానం.. జన సమూహాలు, నిఘా వ్యక్తులు వీధులను ఆక్రమించడానికి అనుమతించలేమని పేర్కొంది. మణిరత్నం దర్శకత్వం వహించిన థగ్ లైఫ్ ప్రదర్శనపై “ఎక్స్ట్రా-జ్యుడీషియల్ నిషేధం”పై ఆందోళన వ్యక్తం చేసిన జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ మన్మోహన్లతో కూడిన ధర్మాసనం.. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ సర్టిఫికెట్ ఉన్న ఏ సినిమానైనా విడుదల చేయాలని స్పష్టం చేసింది.
Thug Life : సుప్రీంకోర్టులో పిల్..
‘థగ్ లైఫ్’ చిత్ర ప్రదర్శనకు అనుమతి ఇవ్వాలని కోరుతూ మహేశ్రెడ్డి దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ధర్మాసనం విచారణ జరుపుతోంది. నిర్మాతలలో ఒకరైన కమల్ హాసన్.. చిత్ర ప్రమోషన్ సమయంలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. తమిళం నుంచి కన్నడం పుట్టిందన్న కమల్ వ్యాఖ్యలు కర్ణాటకలో ఆందోళనలకు దారి తీశాయి. సినిమా ప్రదర్శనకు వ్యతిరేకంగా ఆందోళనలు జరగడంతో థగ్లైఫ్ చిత్రం ఆ రాష్ట్రంలో విడుదల కాలేదు.
రాష్ట్రంలో సినిమా విడుదల గురించి తెలియజేయడానికి కర్ణాటక ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఒక రోజు సమయం ఇచ్చింది. కమల్ హాసన్ ఏదైనా అసౌకర్యంగా మాట్లాడి ఉంటే, దానిని సత్యంగా తీసుకోలేమని, కర్ణాటకలోని విజ్ఞానవంతులైన ప్రజలు చర్చించి ఆయన తప్పు అని చెప్పాలని ధర్మాసనం పేర్కొంది.
Thug Life : కర్ణాటక హైకోర్టు..
కన్నడ భాష(Kannada language) గురించి చేసిన వ్యాఖ్యలపై కమల్ హాసన్ క్షమాపణ చెప్పాలని కర్ణాటక హైకోర్టు చేసిన వ్యాఖ్యలను సుప్రీంకోర్టు తప్పుబట్టింది. కోర్టుకు క్షమాపణ కోరే హక్కు లేదని పేర్కొంది. “కన్నడ.. తమిళం(Tamil) నుంచి పుట్టింది” అని హాసన్ చేసిన వ్యాఖ్యలపై కర్ణాటక హైకోర్టు(Karnataka High Court) తీవ్రంగా మండిపడింది “ఒక్క క్షమాపణతో పరిస్థితి పరిష్కారం కావచ్చు” అని వ్యాఖ్యానించింది. హైకోర్టు ముందు పెండింగ్లో ఉన్న ఈ చిత్రానికి సంబంధించిన కేసును సుప్రీంకోర్టుకు బదిలీ చేసిన ధర్మాసనం, తదుపరి విచారణ కోసం గురువారానికి వాయిదా వేసింది.