More
    Homeబిజినెస్​NSDL IPO | త్వరలో ఐపీవోకు ఎన్‌ఎస్‌డీఎల్.. ఏకంగా 40శాతం పెరిగిన షేరు ధర

    NSDL IPO | త్వరలో ఐపీవోకు ఎన్‌ఎస్‌డీఎల్.. ఏకంగా 40శాతం పెరిగిన షేరు ధర

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : NSDL IPO | డిపాజిటరీ సంస్థ నేషనల్‌ సెక్యూరిటీస్‌ డిపాజిటరీ లిమిటెడ్‌ (NSDL) త్వరలోనే పబ్లిక్‌ ఇష్యూకి రానుంది. వచ్చేనెలలో ఐపీవో (IPO) ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. దీంతో అన్ లిస్టెడ్ స్పేస్​లో కంపెనీ షేర్ ధర పరుగులు తీస్తోంది.

    ఆర్థిక, సెక్యూరిటీల మార్కెట్లలో అనేక ఉత్పత్తులు, సేవలు అందిస్తున్న ఎన్‌ఎస్‌డీఎల్‌ ఐపీవోకు రావడానికి చాలా ఏళ్ల క్రితమే సన్నాహాలు మొదలుపెట్టింది. దేశంలో అతిపెద్ద డిపాజిటరీ(Depository)గా ఉన్న ఎన్‌ఎస్‌డీఎల్‌ గతేడాది అక్టోబర్‌లోనే మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ(SEBI) నుంచి అనుమతులు పొందింది. రూ.3,421 కోట్లు సమీకరించాలన్న లక్ష్యంతో ఐపీవోకు వస్తోంది. 5.01 కోట్ల షేర్లను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ ద్వారా విక్రయించనున్నట్లు సంబంధిత పత్రాల్లో పేర్కొంది. ఎన్‌ఎస్‌డీఎల్‌లో వాటాదారులైన ఐడీబీఐ (IDBI) బ్యాంక్‌ లిమిటెడ్‌, నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌(NSE) లిమిటెడ్‌, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) తమ వాటాలను తగ్గించుకోనున్నాయి. జూలైలో ముహూర్తం ఖరారయ్యే అవకాశాలున్నాయి.

    READ ALSO  pre market analysis | ఎరుపెక్కిన గ్లోబల్‌ మార్కెట్లు.. నెగెటివ్‌గా గిఫ్ట్‌ నిఫ్టీ

    NSDL IPO | అన్‌లిస్టెడ్‌ మార్కెట్‌లో కొనుగోళ్ల జోరు

    ఎన్‌ఎస్‌డీఎల్‌ ఐపీవోకు వస్తుందన్న వార్తలతో అన్‌లిస్టెడ్‌ మార్కెట్‌(Unlisted market)లో ఈ షేరు ధరకు రెక్కలొచ్చాయి. రెండునెలల్లోనే ఏకంగా 40 శాతం పెరిగింది. మే నెలలోనే 30 శాతం పెరగడం గమనార్హం. కంపెనీ బలమైన ఆర్థిక పనితీరును కనబరచడం, ఐపీవోకు వస్తే మంచి లాభాలు వస్తాయన్న ఆశాభావంతో ఇన్వెస్టర్లు ఈ కంపెనీ షేర్లను కొనుగోలు చేయడానికి ఎగబడుతున్నారు. ఏప్రిల్‌ ప్రారంభంలో షేరు ధర రూ. 995 గా ఉంది. ప్రస్తుతం రూ. 1,250కి చేరింది.

    NSDL IPO | కంపెనీ పనితీరు..

    ఎన్‌ఎస్‌డీఎల్‌ కంపెనీ గతేడాది బలమైన పనితీరును కనబరిచింది. గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఆదాయం (Revenue) అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోల్చితే 9.44 శాతం పెరిగి రూ. 394 కోట్లకు చేరింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో (financial year) కంపెనీ రూ. 358 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ. 79.5 కోట్లుగా ఉన్న నికరలాభం (Net profit) 2024-25 ఆర్థిక సంవత్సరంలో 4.77 శాతం పెరిగి రూ. 83.3 కోట్లకు చేరుకుంది. అన్‌లిస్టెడ్‌ స్పేస్‌లో ఎన్‌ఎస్‌డీఎల్‌ షేరు ధర పెరగడానికి కంపెనీ లాభాలు పెరగడమూ ఒక కారణంగా భావిస్తున్నారు.

    READ ALSO  Stock Market | లాభాలతో ముగిసిన సూచీలు

    Latest articles

    Khamenei | ఖ‌మేనీని టార్గెట్ చేసిన ఇజ్రాయిల్‌.. చంపొద్ద‌ని వారించిన ట్రంప్‌

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Khamenei : ఇరాన్‌తో యుద్ధం జ‌రుగుతున్న వేళ ఇజ్రాయిల్ భారీ ప్ర‌ణాళిక వేసింది. ఇరాన్ సుప్రీం...

    Caste Census | జ‌న‌, కుల గ‌ణ‌న‌కు స‌న్నాహాలు.. సోమవారం నోటిఫికేష‌న్ విడుద‌ల

    అక్షరటుడే, న్యూఢిల్లీ: కేంద్ర ప్ర‌భుత్వం (central government) జ‌న గ‌ణ‌న‌(population Census)కు స‌న్నాహాలు చేస్తోంది. ఇందుకు సంబంధించి సోమ‌వారం...

    Sonia Gandhi | సోనియాగాంధీకి అస్వ‌స్త‌త‌.. ఆస్ప‌త్రిలో చేరిక‌

    అక్షరటుడే, న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు సోనియాగాంధీ (Senior Congress leader Sonia Gandhi) ఆదివారం అస్వ‌స్త‌త‌కు గుర‌య్యారు....

    CM Revanth | ఆధునిక పరిశ్రమ అవసరాలకు తగినట్లుగా ఐటీఐల సిలబస్‌ అప్‌గ్రేడ్.. ప్రత్యేక కమిటీకు సీఎం ఆదేశం​

    అక్షరటుడే, హైదరాబాద్: CM Revanth : తెలంగాణలో వీఎఫ్ఎక్స్‌, గేమింగ్‌, ఆడియో విజువల్స్ రంగాలకు సంబంధించి సెంటర్ ఆఫ్...

    More like this

    Khamenei | ఖ‌మేనీని టార్గెట్ చేసిన ఇజ్రాయిల్‌.. చంపొద్ద‌ని వారించిన ట్రంప్‌

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Khamenei : ఇరాన్‌తో యుద్ధం జ‌రుగుతున్న వేళ ఇజ్రాయిల్ భారీ ప్ర‌ణాళిక వేసింది. ఇరాన్ సుప్రీం...

    Caste Census | జ‌న‌, కుల గ‌ణ‌న‌కు స‌న్నాహాలు.. సోమవారం నోటిఫికేష‌న్ విడుద‌ల

    అక్షరటుడే, న్యూఢిల్లీ: కేంద్ర ప్ర‌భుత్వం (central government) జ‌న గ‌ణ‌న‌(population Census)కు స‌న్నాహాలు చేస్తోంది. ఇందుకు సంబంధించి సోమ‌వారం...

    Sonia Gandhi | సోనియాగాంధీకి అస్వ‌స్త‌త‌.. ఆస్ప‌త్రిలో చేరిక‌

    అక్షరటుడే, న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు సోనియాగాంధీ (Senior Congress leader Sonia Gandhi) ఆదివారం అస్వ‌స్త‌త‌కు గుర‌య్యారు....