అక్షరటుడే, వెబ్డెస్క్:Congress | మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు(Sunita Rao)కు జాతీయ అధ్యక్షురాలు అల్కాలాంబ బుధవారం షోకాజ్ నోటీసు(Show Cause Notice)లు జారీ చేశారు.
ఈనెల 14న పీసీసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్(PCC President Mahesh Kumar Goud)పై సునీతారావు పలు ఆరోపణలు చేశారు. నామినేటేడ్ పదవుల భర్తీ విషయంలో మహిళా కాంగ్రెస్కు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. అంతేగాకుండా గాంధీభవన్లోని పీసీసీ చీఫ్ ఎదుట కూర్చొని నిరసన తెలిపారు. ఈ విషయమై ఆమెపై అధిష్టానానికి ఫిర్యాదులు వెళ్లాయి. ఈ క్రమంలో AICC మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కాలాంబ నోటీసులు ఇచ్చారు. ఏడు రోజుల్లో నోటీసులకు సమాధానం చెప్పాలని పేర్కొన్నారు.
కాగా.. పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ పై తప్పుడు ఆరోపణలు చేసిన సునీతారావుపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని గోషామహల్ మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం గాంధీ భవన్(Gandhi Bhavan)లో నిరసన తెలిపిన విషయం తెలిసిందే. సునీతా రావు హఠావో.. కాంగ్రెస్ బచావో అంటూ వారు నినాదాలు చేశారు.