More
    HomeజాతీయంNo Tax | అక్కడ నో ట్యాక్స్.. ఎంత సంపాదించినా పన్ను కట్టక్కర్లేదు

    No Tax | అక్కడ నో ట్యాక్స్.. ఎంత సంపాదించినా పన్ను కట్టక్కర్లేదు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: No Tax | పన్ను చెల్లింపుదారులు, ఆదాయ రకాలను బట్టి ట్యాక్స్ రేట్లు మారుతుంటాయి. మన దేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఆదాయపు పన్ను (Income tax) కట్టాల్సి ఉంటుంది. కానీ, ఆ ఒక్క రాష్ట్రం మాత్రం దీనికి మినహాయింపు.. ఆ రాష్ట్రంలో ఎంత సంపాదించినా ఎలాంటి పన్ను విధించరు. జాబ్, వ్యాపారం సహా ఏ విధంగా ఆదాయం పొందినా పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఆ రాష్ట్రం గురించి తెలుసుకుందామా..

    దేశంలో అర్హతను బట్టి ఆదాయపు పన్ను (Income tax) చెల్లించాల్సి ఉంటుంది. పన్ను మినహాయింపు పొందేందుకు స్టాండర్డ్‌ డెడక్షన్ (Standard deduction) సౌకర్యం ఉంటుంది. అంతకుమించి ఆదాయం ఉన్నవారు తప్పక ఇన్‌కం ట్యాక్స్‌ చెల్లించాల్సి ఉంటుంది. సిక్కిం Sikkim state రాష్ట్రంలో మాత్రం ఎలాంటి ఆదాయపు పన్ను లేదు. అక్కడి పౌరులు ఎంత సంపాదించినా ఒక్క రూపాయి కూడా పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఉద్యోగం, వ్యాపారం, పెట్టుబడుల ద్వారా ఎంత ఆదాయం పొందినా కూడా అక్కడ ఎలాంటి ట్యాక్స్ విధించరు. రాజ్యాంగంలోని Article 371(F), Income Tax Actలోని Section 10(26AAA) ప్రకారం సిక్కిం రాష్ట్రానికి ఈ హక్కు కల్పించారు.

    READ ALSO  Plane Crash | విమాన దుర్ఘటనపై హైలెవెల్ కమిటీ.. మూడు నెలల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశం

    No Tax | ఎందుకు మినహాయించారంటే..

    1975లో సిక్కిం (Sikkim) భారతదేశంలో విలీనమైంది. ఆ సమయంలో సిక్కిం రాజు ఒక ప్రత్యేక షరతు విధించారు. 1975కు ముందు సిక్కింలో అనుసరిస్తున్న పన్ను చట్టాలను కొనసాగించాలని కోరారు. ఆ ఒప్పందంలో భాగంగా సిక్కింకు ట్యాక్స్ మినహాయింపు హక్కు చట్టబద్ధంగా అమలులోకి వచ్చింది. Income Tax Act లోని Section 10(26AAA) ప్రకారం Sikkimes అని గుర్తింపు పొందినవారు ఏ విధంగా ఆదాయం పొందినా పన్ను నుంచి పూర్తి మినహాయింపు పొందుతారు.

    అయితే ఈ ప్రయోజనం దక్కాలంటే చట్ట ప్రకారం.. సిక్కింలో గుర్తింపు పొందిన వ్యక్తులై ఉండాలి. అలాంటి వారికి మాత్రమే పన్ను మినహాయింపులు లభిస్తాయి. పన్ను భారం లేకపోవడం వల్ల ఎక్కువ మంది స్థానిక వ్యాపారవేత్తలు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తారని, దీంతో వ్యాపారాలు అభివృద్ధి చెంది, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించే అవకాశాలు ఉంటాయన్న ఉద్దేశంతో ఈ అవకాశం కల్పించారు. కాగా.. ఇది సిక్కిం ప్రజలకు రాజ్యాంగం కల్పించిన హక్కు. దీనిలో మార్పులు చేయాలంటే తప్పనిసరిగా రాజ్యాంగ సవరణ అవసరం అవుతుంది.

    READ ALSO  South Central Railway | తగ్గనున్న దక్షిణ మధ్య రైల్వే పరిధి

    Latest articles

    Khamenei | ఖ‌మేనీని టార్గెట్ చేసిన ఇజ్రాయిల్‌.. చంపొద్ద‌ని వారించిన ట్రంప్‌

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Khamenei : ఇరాన్‌తో యుద్ధం జ‌రుగుతున్న వేళ ఇజ్రాయిల్ భారీ ప్ర‌ణాళిక వేసింది. ఇరాన్ సుప్రీం...

    Caste Census | జ‌న‌, కుల గ‌ణ‌న‌కు స‌న్నాహాలు.. సోమవారం నోటిఫికేష‌న్ విడుద‌ల

    అక్షరటుడే, న్యూఢిల్లీ: కేంద్ర ప్ర‌భుత్వం (central government) జ‌న గ‌ణ‌న‌(population Census)కు స‌న్నాహాలు చేస్తోంది. ఇందుకు సంబంధించి సోమ‌వారం...

    Sonia Gandhi | సోనియాగాంధీకి అస్వ‌స్త‌త‌.. ఆస్ప‌త్రిలో చేరిక‌

    అక్షరటుడే, న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు సోనియాగాంధీ (Senior Congress leader Sonia Gandhi) ఆదివారం అస్వ‌స్త‌త‌కు గుర‌య్యారు....

    CM Revanth | ఆధునిక పరిశ్రమ అవసరాలకు తగినట్లుగా ఐటీఐల సిలబస్‌ అప్‌గ్రేడ్.. ప్రత్యేక కమిటీకు సీఎం ఆదేశం​

    అక్షరటుడే, హైదరాబాద్: CM Revanth : తెలంగాణలో వీఎఫ్ఎక్స్‌, గేమింగ్‌, ఆడియో విజువల్స్ రంగాలకు సంబంధించి సెంటర్ ఆఫ్...

    More like this

    Khamenei | ఖ‌మేనీని టార్గెట్ చేసిన ఇజ్రాయిల్‌.. చంపొద్ద‌ని వారించిన ట్రంప్‌

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Khamenei : ఇరాన్‌తో యుద్ధం జ‌రుగుతున్న వేళ ఇజ్రాయిల్ భారీ ప్ర‌ణాళిక వేసింది. ఇరాన్ సుప్రీం...

    Caste Census | జ‌న‌, కుల గ‌ణ‌న‌కు స‌న్నాహాలు.. సోమవారం నోటిఫికేష‌న్ విడుద‌ల

    అక్షరటుడే, న్యూఢిల్లీ: కేంద్ర ప్ర‌భుత్వం (central government) జ‌న గ‌ణ‌న‌(population Census)కు స‌న్నాహాలు చేస్తోంది. ఇందుకు సంబంధించి సోమ‌వారం...

    Sonia Gandhi | సోనియాగాంధీకి అస్వ‌స్త‌త‌.. ఆస్ప‌త్రిలో చేరిక‌

    అక్షరటుడే, న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు సోనియాగాంధీ (Senior Congress leader Sonia Gandhi) ఆదివారం అస్వ‌స్త‌త‌కు గుర‌య్యారు....