అక్షరటుడే, వెబ్డెస్క్ : Ministry of External Affairs | అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ US President trump వ్యాఖ్యలను భారత విదేశాంగ శాఖ ఖండించింది. ఆపరేషన్ సిందూర్ operation sindoor అనంతర పరిణామాల సమయంలో అమెరికా, భారత్ మధ్య ట్రేడ్ గురించి చర్చ జరగలేదని స్పష్టం చేసింది. పాకిస్తాన్ నుంచి కాల్పుల విరమణ ceasefire ప్రతిపాదన రావడంతో భారత్ అంగీకరించిందని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. జమ్మూకశ్మీర్ jammu kashmir అంశంలో ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదని పేర్కొంది.
పహల్గామ్లో ఉగ్రదాడి pahalgam terror attack కి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టిన విషయం తెలిసిందే. అనంతరం భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరాయి. రెండు దేశాలు దాడులు, ప్రతిదాడులు చేసుకున్నాయి. ఈ క్రమంలో భారత్, పాకిస్తాన్ కాల్పుల విరమణకు అంగీకరించినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ఆ తర్వాత కొద్దిసేపటికే భారత్ విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ఈ విషయాన్ని ప్రకటించారు.
తాను రెండు దేశాలతో చర్చలు జరపడంతోనే కాల్పులు విరమించాయని ట్రంప్ చెప్పారు. యుద్ధం ఆపకపోతే రెండు దేశాలతో వాణిజ్యం ఆపేస్తామని చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు. అంతేగాకుండా అణుయుద్ధాన్ని nuclear war ఆపానని, కాశ్మీర్ సమస్య పరిష్కారానికి సాయం చేస్తానని ఆయన అన్నారు. తాజాగా ఆయన వ్యాఖ్యలకు భారత విదేశాంగ శాఖ కౌంటర్ ఇచ్చింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ (POK)ను అప్పగించాలన్నదే భారత్ విధానం అని స్పష్టం చేసింది. పాక్ ఉగ్రవాదాన్ని ఆపేవరకు సింధూ నది జలాల రద్దు అమలులో ఉంటుందని తెలిపింది.
Ministry of External Affairs | ప్రతిపక్షాల ఆరోపణలు
కాల్పుల విరమణపై మొదట ట్రంప్ ట్వీట్ చేయడంపై ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. కశ్మీర్ విషయాన్ని ఆయన ప్రస్తావించడాన్ని కూడా ఖండించాయి. మొదటి నుంచి భారత్ కశ్మీర్ విషయంలో మూడో దేశం జోక్యం అవసరం లేదని చెబుతోంది. ఈ క్రమంలో ట్రంప్ వ్యాఖ్యలను ఆయా పార్టీల నేతలు ఖండించారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే విదేశాంగ శాఖ ప్రకటన చేయడం గమనార్హం.