అక్షరటుడే, వెబ్డెస్క్ :Delhi Government | ఢిల్లీలో పెరుగుతున్న కాలుష్యాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ (CAQM) సంచలన నిర్ణయం తీసుకుంది. 2025 జులై 1 నుంచి ఢిల్లీలో 15 ఏళ్లకుపైబడిన పాత పెట్రోల్ వాహనాలకు, 10 ఏళ్లకుపైబడిన పాత డీజిల్ వెహికల్స్(Diesel Vehicles)కు పెట్రోల్ ఫిల్ చేయొద్దని తెలియజేసింది. దేశ రాజధానిలో వాయి కాలుష్యాన్ని తగ్గించే క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సీఏక్యూఎం తెలియజేసింది. ఈ నిబంధన ఢిల్లీ(Delhi)కి మాత్రమే పరిమితం కాదు. గాజియాబాద్, గౌతమ్ బుద్ధనగర్ (నోయిడా), గురుగ్రామ్, సోనిపత్ వంటి ఎన్సీఆర్ ముఖ్య నగరాల్లో ఈ నియమం 2025 నవంబర్ 1 నుంచి అమలులోకి వస్తుంది.
Delhi Government | ఇక వాటికి పెట్రోల్ బంద్..
మిగిలిన ఎన్సీఆర్ నగరాలు ఫరీదాబాద్, పానిపట్, కర్నాల్, బళ్లభ్గఢ్, భివాడి, రేవాడి, పల్వల్, రోహ్తక్, జజ్జర్, మహేంద్రగఢ్, హాపుర్, మెరట్, ముజఫర్నగర్, షామ్లీ, బాగపత్, అలీగఢ్, అల్వార్లలో 2026 ఏప్రిల్ 1 నుంచి ఈ ఆదేశం అమల్లోకి వస్తుంది. CAQM ఆదేశాల ప్రకారం ఢిల్లీ, ఎన్సీఆర్ పెట్రోల్ బంకుల్లో ANPR (Automatic Number Plate Recognisation) కెమెరాలు ఉన్నాయి. లేకుంటే ఏర్పాటు చేస్తారు. అవి వాహనాల నంబర్ ప్లేట్(Number Plate)లను స్కాన్ చేసి వాహనాల ఏజ్ను కాలుష్య ప్రమాణాల సమాచారాన్ని సేకరిస్తాయి. ఈ కెమెరా వ్యవస్థ ద్వారా నిషేధించిన వాహనాలకు పెట్రోల్, డీజిల్ నింపుతున్నారా లేదా అనేది తెలుస్తుంది. అదనంగా, 2025 నవంబర్ 1 నుంచి ఢిల్లీలో BS-6 ప్రమాణాల కంటే తక్కువగా ఉన్న పెట్రోల్, డీజిల్తో నడిచే వాణిజ్య వాహనాలను ఢిల్లీలో ప్రవేశాన్ని నిషేధించారు.
ఢిల్లీకి స్వచ్ఛమైన వాతావరణం(Weather) అందివ్వాలన్న లక్ష్యంతో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. అయితే ఆహార పదార్థాలు, మందులు లేదా ఇతర అవసరమైన గూడ్స్ తీసుకువచ్చే BS-6 కాని వాణిజ్య వాహనాలని మాత్రం 2026 అక్టోబర్ 31 నుంచి ఢిల్లీలోకి ప్రవేశం పూర్తిగా నిషేధించారు. దేశ రాజధాని, ఎన్సీఆర్లో కాలుష్యాన్ని తగ్గించే దిశగా ఇప్పటివరకు CAQM తీసుకున్న అతిపెద్ద కఠినమైన చర్య ఇది. దీని ప్రభావం ఢిల్లీలోని లక్షల వాహన యజమానులపై పడుతుంది. ఇంధన కేంద్రాల్లో పర్యవేక్షణ సాంకేతికతలో పెద్ద మార్పు కనిపిస్తుంది.