More
    Homeకామారెడ్డిNizamsagar project | కళ తప్పిన నిజాంసాగర్​.. తగ్గిపోతున్న పర్యాటకుల సంఖ్య

    Nizamsagar project | కళ తప్పిన నిజాంసాగర్​.. తగ్గిపోతున్న పర్యాటకుల సంఖ్య

    Published on

    అక్షరటుడే, నిజాంసాగర్ : Nizamsagar project | వందేళ్ల చరిత్ర గల నిజాంసాగర్​ ప్రాజెక్ట్​పై (nizamsagar project) పట్టింపు కరువైంది. ఒకప్పుడు పర్యాటకులకు (tourists)ఆహ్లాదాన్ని పంచిన ప్రాజెక్ట్​ అందాలు.. ఇప్పుడు కనమరుగవుతున్నాయి. వేసవి వచ్చిందంటే పర్యాటకుల రద్దీగా ఉండే జలాశయం పరిసరాలు ప్రస్తుతం బోసిపోయి కనిపిస్తున్నాయి.

    నిజాం హయాంలో మంజీర నదిపై (majeera river) నిజాంసాగర్ మండలం అచ్చంపేట– బంజేపల్లి గ్రామాల (achampet-bajempally villages) పరిధిలో 1923-31 మధ్యకాలంలో నిర్మించారు. ప్రధాన ఇంజినీర్​ నవాబ్ ఆలీ​ జంగ్​ బహదూర్​ పర్యవేక్షణలో ప్రాజెక్ట్​ నిర్మాణం పూర్తి చేశారు. 1405 అడుగుల ఎత్తు, 30 టీఎంసీల సామర్థ్యంతో ప్రాజెక్టు నిర్మించారు. ఉమ్మడి నిజామాబాద్​ జిల్లాలో (joint nizamabad district) 2.70 లక్షల ఎకరాలకు ఈ జలాశయం ద్వారా సాగునీరు అందుతోంది. అయితే ప్రాజెక్ట్​ నిర్మాణ (project construction) సమయంలోనే ప్రజల ఆహ్లాదం కోసం పలు నిర్మాణాలు చేపట్టారు. వాటి నిర్వహణను పట్టించుకోకపోవడంతో శిథిలావస్థకు చేరుతున్నాయి.

    Nizamsagar project | నిర్వహణ లేకపోవడంతో..

    ప్రాజెక్ట్ వద్ద సమ్మర్​ బాగ్​, స్మిమ్మింగ్​పూల్​, గోల్​ బంగ్లా నిర్మించారు. నిజాం హయాంలో కట్టిన ఈ నిర్మాణాలు చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాయి. అయితే నిర్వహణ లేకపోవడంతో నిరుపయోగంగా మారాయి. ఒకప్పుడు ఎండాకాలం వచ్చిందంటే ప్రాజెక్ట్​ సందర్శనకు నిత్యం పర్యాటకులు తరలి వచ్చేవారు. తెలంగాణతో పాటు మహారాష్ట్ర (maharastra), కర్నాటక (karnataka) నుంచి కూడా ప్రాజెక్ట్​ అందాలు చూసేందుకు వచ్చేవారు. ప్రాజెక్ట్​ దిగువన ఉన్న సమ్మర్​ బాగ్​లో దొరికే పండ్లను తినేవారు. స్విమ్మింగ్​పూల్​ ఆహ్లాదంగా గడపడంతో పాటు, గోల్​బంగ్లా తదితర ప్రాంతాల్లో సేద తీరేవారు. పట్టించుకునే వారు లేకపోవడంతో సమ్మర్​బాగ్​లో చెట్లన్నీ ఎండిపోయాయి. స్విమ్మింగ్​పూల్​లో నీరు (swimming pool water) నింపడం లేదు. ఫౌంటేన్​ కూడా నిరుపయోగంగా మారింది.

    Nizamsagar project | పత్తాలేని బోటు షికారు

    నిజాంసాగర్​ ప్రాజెక్ట్​ (nizamsagar project) చూడడానికి వచ్చే పర్యాటకులు గతంలో బోటులో షికారు చేసేవారు. గతంలో బోటు అందుబాటులో ఉండేది. దీంతో పర్యాటకులు (tourists) అందులో షికారు చేసి జలాశయం అందాలను తిలకించేవారు. కానీ కొన్నేళ్లుగా ఇక్కడ బోటు షికారు లేకుండా పోయింది. దీంతో పర్యాటకుల తాకిడి క్రమంగా తగ్గిపోతోంది. అధికారులు స్పందించి ప్రాజెక్ట్​ను పర్యాటక కేంద్రంగా (tourist center) మార్చి, వసతులు కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.

    Latest articles

    Showu Restaurant | నాగ చైత‌న్య షోయూ రెస్టారెంట్ ఫుడ్‌లో బొద్దింక‌.. ఉలిక్కిప‌డ్డ క‌స్ట‌మ‌ర్స్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Showu Restaurant | సాధారణంగా సెల‌బ్రిటీల రెస్టారెంట్స్ అంటే అవి చాలా నీట్‌గా, ఫుడ్ కూడా...

    Stock Market | నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు.. 0.8 శాతం పడిపోయిన సెన్సెక్స్‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Stock market | వాల్‌స్ట్రీట్‌(Wall street)తోపాటు ఆసియా మార్కెట్ల ప్రభావం మన మార్కెట్లపైనా కనిపిస్తోంది. దేశీయ...

    Jai Shankar | కాల్పుల విరమణలో ఎవరి జోక్యం లేదు : విదేశాంగ మంత్రి జైశంకర్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Jai Shankar | భారత్​, పాకిస్తాన్(India-Pakistan)​ మధ్య కాల్పుల విరమణ అంశంలో ఎవరి జోక్యం లేదని, భారత్,...

    Traffic Fines | రూ.12 వేల కోట్ల ట్రాఫిక్​ జరిమానాలు.. కట్టింది ఎంతో తెలుసా..

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Traffic Fines | వాహనదారులు ట్రాఫిక్​ నిబంధనలు పాటించాలని పోలీసులు తనిఖీలు చేపడుతారు. నిబంధనలు పాటించని...

    More like this

    Showu Restaurant | నాగ చైత‌న్య షోయూ రెస్టారెంట్ ఫుడ్‌లో బొద్దింక‌.. ఉలిక్కిప‌డ్డ క‌స్ట‌మ‌ర్స్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Showu Restaurant | సాధారణంగా సెల‌బ్రిటీల రెస్టారెంట్స్ అంటే అవి చాలా నీట్‌గా, ఫుడ్ కూడా...

    Stock Market | నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు.. 0.8 శాతం పడిపోయిన సెన్సెక్స్‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Stock market | వాల్‌స్ట్రీట్‌(Wall street)తోపాటు ఆసియా మార్కెట్ల ప్రభావం మన మార్కెట్లపైనా కనిపిస్తోంది. దేశీయ...

    Jai Shankar | కాల్పుల విరమణలో ఎవరి జోక్యం లేదు : విదేశాంగ మంత్రి జైశంకర్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Jai Shankar | భారత్​, పాకిస్తాన్(India-Pakistan)​ మధ్య కాల్పుల విరమణ అంశంలో ఎవరి జోక్యం లేదని, భారత్,...