అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad Excise police | గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి సోమిరెడ్డి (Excise Enforcement Officer Somireddy) ఆదేశాల మేరకు శుక్రవారం నగరంలోని షాకీర్ ఫామ్ హౌస్లో తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా గంజాయి అమ్ముతున్న షేక్ షకీల్, దాగే తుకారాంలను పోలీసులు ఎక్సైజ్ సిబ్బంది అరెస్టు చేశారు. మరో నిందితుడు దాగె మధుకర్ పరారీలో ఉన్నారు. వారి వద్ద నుంచి 184 గ్రాముల ఎండు గంజాయిని సీజ్ చేశారు. ఎవరైనా గంజాయి, మత్తు పదార్థాలు అమ్మితే 8712658970 నంబరుకు సమాచారం ఇవ్వాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని చెప్పారు. ఎక్సైజ్ అధికారులు, సిబ్బంది స్వప్న, రామకుమార్, హమీద్, శివ, ఉత్తమ్, అవినాష్, భోజన్న, విష్ణు, రాజన్న, పాల్గొన్నారు.