More
    HomeతెలంగాణTurmeric Board | పసుపు రైతుల కల నెరవేర్చాం : కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి

    Turmeric Board | పసుపు రైతుల కల నెరవేర్చాం : కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Turmeric Board | పసుపు రైతుల దశాబ్దాల కలను కేంద్ర ప్రభుత్వం నెరవేర్చిందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్​ రెడ్డి (Kishan Reddy) అన్నారు. తెలంగాణతో పాటు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్​ పసుపు సాగవుతున్నా.. ఈ ప్రాంతంపై ప్రేమతో ప్రధాని మోదీ (PM Modi), హోం మంత్రి అమిత్​ షా (Amit Shah)లు నిజామాబాద్​లో పసుపుబోర్డు కేంద్ర కార్యాలయం ఏర్పాటు చేశారన్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రైతు పక్షపాతి అని పేర్కొన్నారు. ఈ ప్రాంత రైతులకు కేంద్రం అండగా ఉంటుందన్నారు. రైతులకు ఎరువులకు ఇబ్బంది రాకుండా చర్యలు తీసుకుందన్నారు. ఇందుకోసం రామగుండంలో ఎరువుల ఫ్యాక్టరీని ప్రారంభించిందని గుర్తు చేశారు.

    Turmeric Board | నిజామాబాద్​ జిల్లా వాళ్లు గొప్పోళ్లు

    నిజామాబాద్ జిల్లా (Nizamabad district) వారు గొప్ప వాళ్లని కేంద్ర మంత్రి బండి సంజయ్​ (Union Minister Bandi Sanjay) అన్నారు. ఎన్నో పోరాటాలు చేసి పసుపు బోర్డు సాధించారని ఆయన పేర్కొన్నారు. ఇందూరు రైతులు హీరోలు అని ఆయన అభివర్ణించారు. ఎంపీ అర్వింద్​ను ఢిల్లీలో పసుపు అర్వింద్​ (Turmeric Arvind) అంటున్నారని ఆయన పేర్కొన్నారు. పసుపు బోర్డు కోసం అర్వింద్​ ఎంతో కృషి చేశారన్నారు. రైతును రారాజు చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. పసుపు రైతుల పోరాటాలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఇందూరు కేంద్రంగా పసుపు బోర్డు ఏర్పాటు చేసిందన్నారు. తెలంగాణలో బీజేపీకి ఒక్కసారి అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు.

    READ ALSO  Nizamabad | ఎనిమిది మంది జూదరుల అరెస్టు

    Turmeric Board | పసుపు ప్రతి ఒక్కరి జీవితంలో భాగం..

    పసుపు అనేది ప్రతిఒక్కరి జీవితంలో భాగంగా మారిందని.. అలాంటి పసుపు పంటపైనే తెలంగాణ రైతులు ఆధారపడి ఉన్నారని ఎంపీ అర్వింద్ (MP Arvind)​ పేర్కొన్నారు. అలాగే కశ్మీర్​లో 370 ఆర్టికల్ (Article 370)​ రద్దు నుంచి నక్సల్​ ముక్త్​ భారత్​ వరకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఉన్నో విజయాలు సాధించిందన్నారు. తాజాగా ఉగ్రవాదులను అంతం చేయడంలో సైతం భారత్​ చూపిన తెగువను ప్రపంచ దేశాలు అభినందిస్తున్నాయన్నారు. ఉగ్రవాదుల అంతం వరకు భారత ప్రభుత్వం చేస్తున్న కృషి ఎనలేనిదని స్పష్టం చేశారు. ప్రతి మహిళ సిందూరంలో పసుపు భాగమైందన్నారు. తెలంగాణలో రైతులంతా బీజేపీ (BJP) వెంటే ఉన్నారన్నారు. పసుపు రైతులపై ప్రేమతోనే నిజామాబాద్​ బిడ్డను జాతీయ పసుపు బోర్డు ఛైర్మన్​గా ఎంపిక చేశారని గుర్తు చేశారు.

    READ ALSO  Mla Dhanpal | వికసిత్​ భారత్​ లక్ష్యంగా పనిచేస్తున్నాం

    Latest articles

    Air India | మరో విమానంలో సాంకేతిక లోపం.. ఎమర్జెన్సీ ల్యాండింగ్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Air India | విమానం ఎక్కాలంటే ప్రయాణికులు హడలి పోతున్నారు. వరుస ఘటనలతో భయపడుతున్నారు.ఇటీవల అహ్మదాబాద్...

    Junior Doctors | జూడాల సమ్మె విరమణ

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Junior Doctors | తెలంగాణలో జూనియర్​ డాక్టర్లు (Junior doctors) కీలక నిర్ణయం తీసుకున్నారు. సమ్మె...

    Amit shah tour | ఎంపీ అర్వింద్‌పై అక్కసు.. ఆ నేతలు రాకుండా అడ్డుపుల్లలు.. బీజేపీ రాష్ట్ర నాయకత్వం తీరుపై శ్రేణుల అసహనం..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Amit shah tour | కేంద్ర ప్రభుత్వం జాతీయ పసుపు బోర్డు (national turmeric board)...

    Turmeric Board | స్థానిక ఎన్నికల కోసమే మళ్లీ పసుపు బోర్డు ప్రారంభం : ఎమ్మెల్యే వేముల

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Turmeric Board | స్థానిక ఎన్నికల కోసమే పసుపు బోర్డు కార్యాలయాన్ని మళ్లీ ప్రారంభించారని...

    More like this

    Air India | మరో విమానంలో సాంకేతిక లోపం.. ఎమర్జెన్సీ ల్యాండింగ్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Air India | విమానం ఎక్కాలంటే ప్రయాణికులు హడలి పోతున్నారు. వరుస ఘటనలతో భయపడుతున్నారు.ఇటీవల అహ్మదాబాద్...

    Junior Doctors | జూడాల సమ్మె విరమణ

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Junior Doctors | తెలంగాణలో జూనియర్​ డాక్టర్లు (Junior doctors) కీలక నిర్ణయం తీసుకున్నారు. సమ్మె...

    Amit shah tour | ఎంపీ అర్వింద్‌పై అక్కసు.. ఆ నేతలు రాకుండా అడ్డుపుల్లలు.. బీజేపీ రాష్ట్ర నాయకత్వం తీరుపై శ్రేణుల అసహనం..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Amit shah tour | కేంద్ర ప్రభుత్వం జాతీయ పసుపు బోర్డు (national turmeric board)...