అక్షర టుడే, ఇందూరు: Nizamabad CP | విద్యార్థులు ఇష్టపడి చదవాలని సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) సూచించారు.
ఎంఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ (MSR Charitable Trust) ఆధ్వర్యంలో పది, ఇంటర్ ఫలితాల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఆదివారం సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 11 జిల్లాలకు చెందిన 200 మంది విద్యార్థులకు (students) రూ.15వేల చొప్పున నగదు పురస్కారం అందజేశారు. సీపీ మాట్లాడుతూ.. జీవితంలో ప్రతి ఒక్కరూ ఒక లక్ష్యాన్ని ఎంచుకోవాలని, దానిని సాధించేవరకు కష్టపడాలని సూచించారు. కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ సాంబశివరెడ్డి, డైరెక్టర్లు ధనుష్ రెడ్డి, రాజు రెడ్డి, డాక్టర్ అబ్బాపూర్ రవి, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.