అక్షరటుడే, ఆర్మూర్: Collector Rajiv Gandhi Hanumanthu | ధాన్యం సేకరణలో ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతు (Collector Rajiv Gandhi Hanumanthu) ఆదేశించారు. ఇందుకోసం నిల్వ కోసం అదనంగా గోడౌన్లు పరిశీలించాలని సూచించారు. ఆర్మూర్ మండలంలోని పెర్కిట్, బాల్కొండ, మోపాల్ మండలం వెంచిర్యాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను (Paddy Purchasing Centers) బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అకాల వర్షాల నేపథ్యంలో రైతుల(Farmers) నుంచి సేకరించిన ధాన్యాన్ని వెనువెంటనే రైస్మిల్లు(Ricemills)లకు తరలించి, అన్లోడ్ చేయించాలన్నారు. హమాలీలు, లారీల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆయన వెంట డీఎస్వో అరవింద్ రెడ్డి Dso Aravind Reddy, సివిల్ సప్లయ్స్ డీఎం శ్రీకాంత్ రెడ్డి civil supplies DM Srikanth reddy, ఐకేపీ డీపీఎం సాయిలు, తదితరులున్నారు.
