అక్షరటుడే, ఇందూరు:Nizamabad City | ఓ లారీ డ్రైవర్(Lorry Driver) చేసిన తప్పిదానికి వరుసగా ఐదు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటన నిజామాబాద్ బైపాస్ రోడ్(Bypass Road nizamabad)లో సోమవారం ఉదయం చోటు చేసుకుంది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కంఠేశ్వర్ బైపాస్ రోడ్లో వెళ్తున్న ఓ లారీడ్రైవర్ సడెన్ బ్రేక్(Sudden Break) వేశాడు. దీంతో లారీ వెనుక ఉన్న రెండు కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. అలాగే కార్ల వెనకాల ఉన్న ఓ డీసీఎం, మరో రెండుకార్లు కూడా ప్రమాదానికి గురయ్యాయి. ఈ ఘటనలో నాలుగు వాహనాలు ధ్వంసమయ్యాయి. కార్లలో ఉన్న వ్యక్తులకు స్వల్ప గాయాలయ్యాయి.