అక్షరటుడే, కామారెడ్డి: Ramareddy | అప్పుల ఊబిలో ఉన్న కుటుంబానికి బాసటగా ఉండేందుకు విదేశాల బాటపట్టిన యువకుడు అనారోగ్యంతో మృతి చెందాడు. ఈ ఘటన దుబాయ్లో (dubai) ఈనెల 24న జరిగింది.
వివరాల్లోకి వెళ్తే.. రామారెడ్డి (Ramareddy) మండలం గోకుల్ తండాకు (Gokul Thanda) చెందిన భాస్కర్ నాయక్(19) 9 నెలల క్రితం దుబాయ్లోని బర్కిలీ కంపెనీలో ఉపాధి నిమిత్తం చేరాడు. ప్రతిరోజు మాదిరిగానే పనులు చేస్తుండగా ఈనెల 24 న ఒక్కసారిగా కడుపు నొప్పి, బాడీ పెయిన్ రావడంతో అల్ అయిన్లోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. మరుసటి రోజు చికిత్స పొందుతూ మృతి చెందాడు.
ఈ విషయాన్ని జిడబ్ల్యూఏసీ యూఏఈ అధ్యక్షుదు గడ్చంద నరేందర్కుటుంబ సభ్యులకు తెలియజేశారు. ఆయనే కంపెనీ యాజమాన్యంతో మాట్లాడి వారి సహకారంతో మృతదేహాన్ని ఇంటికి పంపించారు. హైదరాబాద్ ఎయిర్పోర్టు నుంచి ఉచిత అంబులెన్స్ ద్వారా స్వగ్రామానికి మృతదేహాన్ని తరలించారు. సీఎం రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసిన గల్ఫ్ సంక్షేమ నిధి నుంచి రూ. 5 లక్షలు మంజూరు చేయాలని గ్రామస్థులు కోరారు.