అక్షరటుడే, వెబ్డెస్క్: Hero nikhil | పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది అమాయకుల ప్రాణాలను తీశారు ఉగ్రవాదులు (terrorists). దీంతో ఆపరేషన్ సిందూర్ (operation sindoor) పేరుతో పాక్లోని తొమ్మిది ప్రాంతాల్లో టెర్రర్ క్యాంప్పై మెరుపుదాడులకు దిగిన ఇండియన్ ఆర్మీ (indian army) వాటిని నేలమట్టం చేసింది. దీనికి ప్రతిగా పాకిస్తాన్ భారత్లోని ఎయిర్బేస్లు, మిలటరీ స్థావరాలపై డ్రోన్లు, మిస్సైళ్లతో దాడులు (drones and missile attacks) చేసే ప్రయత్నం చేయగా, మన సైన్యం వాటిని తిప్పి కొట్టింది. పాకిస్తాన్లోని పలు నగరాల్లో మోహరించి ఉంచిన ఎయిర్ డిపెన్స్ సిస్టమ్స్ (air defence system), యుద్ధ విమానాలను (warplanes) కూల్చేసింది. ఇండియాను రెచ్చగొట్టవద్దని పర్యవసనాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది.
Hero nikhil | టర్కీపై ఆగ్రహం
భారత సైన్యం దెబ్బకు వణికిపోయిన పాకిస్తాన్ (Pakistan) సాయం కోసం అంతర్జాతీయ సమాజాన్ని అభ్యర్ధించినా ఏ దేశమూ దానిని పట్టించుకోలేదు. అయితే అనూహ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (america president donald trump) భారత్ – పాకిస్తాన్ల మధ్య కాల్పుల విరమణ అమల్లోకి వచ్చినట్లు ప్రకటించారు. సాధారణ ప్రజలు బలి కావడం మంచిది కాదని మానవతా దృక్పథంతో ప్రధాని నరేంద్ర మోడీ (prime minister narendra modi) కూడా దయ చూపించారు. యుద్ధం ఆగిన తర్వాత ఎవరు మన శత్రువు, ఎవరు మనల్ని కష్టకాలంలో ఆదుకుంటున్నారో ఇండియాకు బాగా తెలిసొచ్చింది.
టర్కీ, అజర్బైజాన్లు పాకిస్తాన్కు అండగా నిలవడంపై భారత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. 2023లో టర్కీని భూకంపం (turkey earthquake) కుదిపేస్తే స్పందించిన తొలి దేశం ఇండియానే. అలాంటి టర్కీ పాక్కు మద్దతు ఇచ్చింది . ఈ క్రమంలో భారతీయులను టర్కీపై తీవ్ర వ్యతిరేక వ్యక్తమవుతోంది. ఇప్పటికే కొంతమంది పండ్ల వ్యాపారులు టర్కీ యాపిల్స్ను (Apples) దిగుమతి చేసుకోవడానికి నిరాకరించారు. బాయ్ కాట్ టర్కీ అనే క్యాంపెయిన్ కూడా రన్ అవుతోంది. టర్కీలో భారతీయ సినీ నిర్మాతలు (indian movie producers) షూటింగ్స్ పెట్టుకోవద్దని ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ అన్ని భారతీయ చిత్ర నిర్మాతలను కోరింది. ఇక హీరో నిఖిల్ (hero nikhil) కూడా ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇప్పుడు చెప్పండి ఆ టర్కీ దేశం వెళ్తారా. మన వాళ్లు చాలా మంది ఆ దేశం వెళ్లి అక్కడ డబ్బులు ఖర్చు పెడుతున్నారు. అలాంటి దేశం కోసం మనం డబ్బులు ఖర్చు పెట్టొద్దు. ఆ దేశం వస్తువులు కూడా వాడొద్దు’ అంటూ ‘ఎక్స్’లో రాసుకొచ్చాడు నిఖిల్.