More
    Homeక్రైంHyderabad | కావాలనే కేసులు పెట్టించుకుంటున్న నైజీరియన్లు.. ఎందుకో తెలుసా?

    Hyderabad | కావాలనే కేసులు పెట్టించుకుంటున్న నైజీరియన్లు.. ఎందుకో తెలుసా?

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad | హైదరాబాద్(Hyderabad)​ నగరంలోని పలు ప్రాంతాల్లో నైజీరియన్లు(Nigerians) నివసిస్తున్నారు. మెహదీపట్నం, లంగర్​హౌజ్​, సన్​సిటీ, గచ్చిబౌలి ప్రాంతాల్లో ఎక్కువ సంఖ్యలో నైజీరియన్లు ఉంటున్న విషయం తెలిసిందే.

    వీరిలో కొందరు అక్రమ మార్గంలో వచ్చిన వారు కూడా ఉన్నారు. అయితే వీరు ఇక్కడ ఎక్కువగా సైబర్​ నేరాలు(Cyber Crimes), డ్రగ్స్​ దందా నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నగరంలో నేరాలకు పాల్పడుతున్న నైజీరియన్లను వారి దేశానికి పంపిస్తున్నట్లు(Deport) హైదరాబాద్​ సీపీ సీవీ ఆనంద్ (CP CV Anand)​ తెలిపారు. అయినా కూడా వారు మళ్లీ అక్రమ మార్గంలో నగరంలోకి వస్తున్నారని ఆయన పేర్కొన్నారు. అలా నకిలీ పాస్​పోర్టులతో వచ్చిన వారిని సైతం అరెస్ట్​ చేశామన్నారు.

    Hyderabad | తప్పించుకోవడానికి.. కేసుల్లో ఇన్వాల్వ్​

    నైజీరియన్లను వారి దేశానికి పంపుతుండటంతో పలువురు కావాలనే కేసుల్లో చిక్కుకుంటున్నారు. ఏదో ఒక కేసులో ఇన్వాల్వ్ అవుతున్నారని సీపీ ఆనంద్ తెలిపారు. “ఇలా కేసుల్లో ఉన్న వారిని కేసు విచారణ పూర్తయ్యే వరకు వారి దేశానికి పంపలేము. దీంతో వారు కావాలనే కేసుల్లో ఇన్వాల్వ్​ అవుతున్నట్లు” ఆయన వెల్లడించారు. బంగ్లాదేశ్​(BangladesH)కు చెందిన పౌరులు కూడా శరణార్థులుగా ఇక్కడికి వస్తున్నారని.. ఈ విషయాన్ని కేంద్ర హోం శాఖ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.

    Latest articles

    Hyderabad | జీహెచ్​ఎంసీకి భారీగా నిధులు విడుదల

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad | రాష్ట్ర ప్రభుత్వం జీహెచ్​ఎంసీ(GHMC)కి భారీగా నిధులు విడుదల చేసింది. 2025-26 ఆర్థిక...

    MLC Kavitha | కేసీఆర్​ మీద ఈగ కూడా వాలనివ్వను: ఎమ్మెల్సీ కవిత

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : MLC Kavitha | ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) వ్యాఖ్యలు బీఆర్​ఎస్​తో పాటు...

    Prajavani | ప్రజావాణి వాయిదా

    అక్షరటుడే, కామారెడ్డి: Prajavani | కలెక్టర్ కార్యాలయంలో వచ్చే సోమవారం నిర్వహించే ప్రజావాణి వాయిదా వేస్తున్నట్లు కలెక్టర్ ఆశిష్...

    Operation Sindoor | యుద్ధ విమానాలను కోల్పోయాం.. తొలిసారి అంగీకరించిన ఆర్మీ

    అక్షరటుడే, వెబ్​డెస్క్‌:Operation Sindoor | పాకిస్తాన్ తో జరిగిన ఉద్రిక్తతల సమయంలో యుద్ధ విమానాలను కోల్పోయామని భారత సైన్యం...

    More like this

    Hyderabad | జీహెచ్​ఎంసీకి భారీగా నిధులు విడుదల

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad | రాష్ట్ర ప్రభుత్వం జీహెచ్​ఎంసీ(GHMC)కి భారీగా నిధులు విడుదల చేసింది. 2025-26 ఆర్థిక...

    MLC Kavitha | కేసీఆర్​ మీద ఈగ కూడా వాలనివ్వను: ఎమ్మెల్సీ కవిత

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : MLC Kavitha | ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) వ్యాఖ్యలు బీఆర్​ఎస్​తో పాటు...

    Prajavani | ప్రజావాణి వాయిదా

    అక్షరటుడే, కామారెడ్డి: Prajavani | కలెక్టర్ కార్యాలయంలో వచ్చే సోమవారం నిర్వహించే ప్రజావాణి వాయిదా వేస్తున్నట్లు కలెక్టర్ ఆశిష్...