అక్షరటుడే, వెబ్డెస్క్ :NIA Searches | దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో శనివారం ఎన్ఐఏ అధికారులు (NIA Officers) సోదాలు నిర్వహించారు. ఇటీవల పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) అనంతరం భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే.
ఆపరేషన్ సిందూర్తో భారత్ పాక్(Pakistan)లోని ఉగ్రవాదుల పని పట్టింది. అనంతరం రెండు దేశాలు దాడులు, ప్రతిదాడులు చేసుకున్నాయి. ఈ క్రమంలో కాల్పుల విమరణకు రెండు దేశాలు అంగీకరించాయి. అయితే ఆపరేషన్ సిందూర్తో ఉగ్రవాదులు పీచం అణచిన భారత్.. తాజాగా ఇంటి దొంగల పని పడుతోంది. ఇందులో భాగంగానే ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తోంది.
NIA Searches | 15 ప్రాంతాల్లో..
దేశంలోని పలువురు పాకిస్తాన్ గూఢచర్యం చేస్తున్నట్లు ఇటీవల నిఘా వర్గాలు గుర్తించాయి. ఈ మేరకు ఇప్పటికే పలువురిని పోలీసులు (Police) అదుపులోకి తీసుకున్నారు. అలాగే పలువురికి ఉగ్రవాదులతో లింక్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ మేరకు ఎన్ఐఏ ఏడు రాష్ట్రాల్లోని 15 ప్రాంతాల్లో శనివారం సోదాలు నిర్వహించింది. ఉగ్ర లింకులపై ఏకకాలంలో ఢిల్లీ, హర్యానా, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, అస్సాంలలో సోదాలు చేపట్టింది. సోదాలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.