అక్షరటుడే, హైదరాబాద్: Anchor Swecha : టీవీ యాంకర్(TV anchor) ఆత్మహత్య చేసుకుంది. హైదరాబాద్ సిటీలో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది.
టీ న్యూస్ ఛానల్లో పనిచేసే యాంకర్ స్వేచ్చ శుక్రవారం సూసైడ్ చేసుకుంది. హైదరాబాద్లోని జవహర్ నగర్(Jawahar Nagar, Hyderabad)లో ఉన్న తన ఇంట్లో తనువు చాలించింది. ఘటనా స్థలానికి చిక్కడపల్లి పోలీసులు (Chikkadapalli police) చేరుకున్నారు. మృతదేహాన్ని గాంధీ ఆసుప్రతికి తరలించారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
Anchor Swecha : న్యూస్ ఛానల్లో స్పెషల్ కరస్పాండెంట్గా..
కాగా, స్వేచ్ఛ గత 18 ఏళ్లుగా జర్నలిజం రంగంలో ఉంది. ప్రస్తుతం టీ న్యూస్ ఛానల్(T News Channel)లో స్పెషల్ కరస్పాండెంట్(special correspondent)గా పనిచేస్తోంది. ఆమె తన తల్లి శ్రీదేవితో కలిసి జవహార్ నగర్లో ఉంటోంది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. జర్నలిజంలో ఎంతో అనుభవం కలిగిన ఈమె సూసైడ్ చేసుకోవడం చర్చకు దారితీసింది.