అక్షరటుడే, హైదరాబాద్: Indira Saura Giri Jal Vikasam scheme : తెలంగాణ రాష్ట్రం(Telangana state) లో మరో కొత్త పథకం(new scheme) రాబోతోంది. ఇందిర సౌర గిరి జల వికాసం పథకానికి రాష్ట్ర సర్కారు అంకురార్పణ చేయబోతోంది. ఈ పథకాన్ని రేపు(మే 19) ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి(Chief Minister Revanth Reddy) ప్రారంభించనున్నారు. దీని కింద సోలార్ పంపుసెట్లు ఏర్పాటు చేసి, సాగునీటిని అందిస్తారు.
RoFR(అటవీ హక్కుల చట్టం-2006)(Forest Rights Act-2006) భూములు కలిగి ఉన్న గిరిజన రైతులే (tribal farmers) దీనికి అర్హులు. 2.5 ఎకరాలు లేదా అంతకు మించి ఉన్నవారికి ఒకే యూనిట్ మంజూరు చేస్తారు. 2.5 ఎకరాల కంటే తక్కువ భూమి ఉంటే.. ఇతర రైతులతో కలిపి యూనిట్గా పరిగణిస్తారు. యూనిట్ ఖర్చు రూ.6 లక్షలు మించకూడదనేది నియమం.