అక్షరటుడే, వెబ్డెస్క్ : Railways | రైల్వే శాఖ railway dept మే 1 నుంచి పలు కొత్త రూల్స్ new rules తీసుకొచ్చింది. ఇందులో భాగంగా ఇక నుంచి వెయిటింగ్ లిస్ట్ waiting list ఉన్న అభ్యర్థులు జనరల్ బోగిల్లోనే ప్రయాణించాలి. టికెట్ కన్ఫర్మ్ కాకుండా వెయింటింగ్ టికెట్తో స్లీపర్ కోచ్ sleeper coach లో ప్రయాణిస్తే రూ.250 జరిమానా, ఏసీ కోచ్ AC coachలో ప్రయాణిస్తే రూ.440 జరిమానా fine విధిస్తామని రైల్వే శాఖ ప్రకటించింది. టికెట్ కన్ఫర్మ్ కానీ వారు ఇక జనరల్ బోగిల్లోనే వెళ్లాలని స్పష్టం చేసింది. కన్ఫర్మ్ టికెట్ లేనివారు ఇతర కోచ్లలో ప్రయాణించడంతో సీట్ రిజర్వ్ చేసుకున్న ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.
Railways | వారికి ఇబ్బందులు
రైల్వే అమలు చేస్తున్న ఈ కొత్త నిర్ణయంతో రైల్వే కౌంటర్ల నుంచి వెయిటింగ్ లిస్ట్ టికెట్లు బుక్ చేసుకునే వారికి ఇబ్బందులు ఎదురు కానున్నాయి. ఆన్లైన్లో inline టికెట్ బుక్ చేసుకుంటే.. కన్ఫర్మ్ కాకపోతే ఆటోమేటిక్గా క్యాన్సిల్ cancell అవుతుంది. అయితే కౌంటర్లో counter బుక్ చేసుకుంటే మాత్రం క్యాన్సిల్ చేసుకునే అవకాశం ఉండదు.
దీంతో వీరు గతంలో వెయింటింగ్ టికెట్లతో రైలు ఎక్కేవారు. ఎక్కడైనా ఖాళీ ఉంటే టీటీఈ అనుమతి తీసుకొని అక్కడ కూర్చునేవారు. అయితే ఇప్పుడు అలా కుదరదు. ఇలా చాలా మంది స్లీపర్, ఏసీ బోగీల్లోకి ప్రవేశించి ఇతర సీట్లలో కూర్చోవడంతో బోగీల్లో రద్దీకి కారణం అవుతున్నారు. దీంతో రైల్వే శాఖ తాజా నిర్ణయం తీసుకుంది.