అక్షరటుడే, వెబ్డెస్క్: Petrol Bunk | పెట్రోల్ బంక్ల(Petrol Bunk) నిర్వాహకులు తమ లాభాల కోసం వాహనదారులను మోసం(Fraud) చేస్తున్నారు. మీటర్లలో సెట్టింగ్లు మార్చడంతో పాటు చిప్లు పెట్టి తక్కువ పెట్రోల్ వచ్చేలా చేస్తున్నారు. దీంతో వాహనదారులు తీవ్రంగా నష్టపోతున్నారు. తాజాగా ఇలాంటి ఘటన హైదరాబాద్లోని(Hyderabad) ఉప్పల్ పరిధిలో చోటు చేసుకుంది.
ఉప్పల్ పరిధిలో మెహిఫిల్ రెస్టారెంట్(Mehfil Restaurant) ఎదురుగా ఉన్న భారత్ పెట్రోల్ పంపు(Bharat petrol pump)లో ఓ వ్యక్తి రూ.100 పెట్రోల్ను బాటిల్లో పోయించాడు. అయితే తక్కువ పెట్రోల్ రావడంతో ఆయన సిబ్బందిని ప్రశ్నించాడు. దాంతో వంద రూపాయలకే అంతే వస్తుందని బంక్ సిబ్బంది దబాయించారు. దీంతో సిబ్బందిపై వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మీటర్లో సెట్టింగ్ చేసి తక్కువ పెట్రోల్(Petrol) పోసి ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. అంతేగాకుండా పలువురు వాహనదారులు పోగై సిబ్బందిని నిలదీయడంతో వారు నీళ్లు నమిలారు. పొరపాటున అలా వచ్చిందని సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఇలాంటి బంక్లపై కఠిన చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.