అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad railway Station | నగరంలోని రైల్వేస్టేషన్లో నేస్తం కేంద్రాన్ని (Nestam Center) గురువారం ప్రారంభించినట్లు దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) డివిజన్ అధికారి ఆనంద్ కట్టా తెలిపారు. ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు, సలహాలు, సూచనలతోపాటు వాటి పరిష్కారం కోసం ఈ కేంద్రం పనిచేస్తుందని వివరించారు. కేంద్రంలో వచ్చిన ఫిర్యాదులను సమస్య తీవ్రత ఆధారంగా అక్కడికక్కడే పరిష్కరిస్తామని చెప్పారు.
Nizamabad railway Station | రైల్వే స్టేషన్లో ‘నేస్తం’ కేంద్రం ప్రారంభం
Published on
