అక్షరటుడే, వెబ్డెస్క్: NEET PG Exam | సుప్రీంకోర్టు(Supreme Court) తీర్పుతో వాయిదా పడిన నీట్ పరీక్ష తేదీని నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్(NBE) ఖరారు చేసింది. ఆగస్టు 3న దేశవ్యాప్తంగా ఒకేసారి నీట్ పీజీ పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు కూడా ఆగస్టు 3న పరీక్ష నిర్వహించుకునేందుకు అనుమతి ఇచ్చింది.
తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 15న పరీక్ష జరగాల్సి ఉంది. అయితే రెండు షిఫ్టులలో పరీక్షల నిర్వహణకు ఎన్బీఈ నిర్ణయించింది. దీనిపై పలువురు సుప్రీంకోర్టు (supreme court)ను ఆశ్రయించారు. రెండు షిఫ్టులతో పరీక్షలు నిర్వహిస్తే.. ఒక షిఫ్టులో వారికి కఠినంగా, మరొక షిఫ్ట్లో వారికి సులభమైన ప్రశ్నాపత్రం వస్తోందని పలువురు విద్యార్థులు(Students) సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసుపై మే 30న విచారణ జరిపిన న్యాయస్థానం ఒకే షిఫ్ట్లో పరీక్ష నిర్వహించాలని ఆదేశించింది. దీంతో ఎన్బీఈ పరీక్ష వాయిదా వేసింది. ఆగస్టు 3న ఒకే షిఫ్ట్లో పరీక్ష నిర్వహిస్తామని తాజాగా ఎన్బీఈ ప్రకటించింది.