అక్షరటుడే, వెబ్డెస్క్: Neeraj Chopra | భారత స్టార్జావెలిన్త్రో ప్లేయర్ నీరజ్ చోప్రా(Neeraj Chopra) సరికొత్త రికార్డు సృష్టించాడు. భారత్కు రెండు ఒలింపిక్ పతకాలు అందించిన నీరజ్ తాజాగా దోహా డైమండ్ లీగ్(Doha Diamond League)లో ఈటెను 90.23 మీటర్లు విసిరాడు. తన కెరీర్లో తొలిసారి 90 మీటర్ల మార్క్ను నీరజ్ చోప్రా అధిగమించడం గమనార్హం. కాగా గతంలో ఆయన అత్యధికంగా 89.4 మీటర్లు దూరం ఈటెను విసిరాడు. తాజాగా ఆ రికార్డును బద్దలు కొట్టాడు. దోహలో జరిగిన పోటీల్లో మొదటి ప్రయత్నంలో ఈరజ్జావెలిన్ను 88.44 మీటర్ల దూరం విసిరాడు. అనంతరం రెండో ప్రయత్నంలో ఫౌల్ అయ్యాడు. మూడో సారి 90.23 మీటర్ల మార్క్ అందుకున్నాడు. నాలుగో ప్రయత్నంలో 80.56 మీటర్లు విసిరిన నీరజ్ ఐదోసారి మళ్లీ ఫౌల్ అయ్యాడు. జర్మనీకి చెందిన జులియన్ వెబర్ ఏకంగా 91.06 మీటర్లు విసిరాడు. దీంతో ఆయన విజేతగా నిలవగా.. నీరజ్ రెండోస్థానంతో సరిపెట్టుకున్నారు.
Neeraj Chopra | రెండు ఒలింపిక్ పతకాలు
నీజర్ చోప్రా భారత్కు రెండు ఒలింపిక్ పతకాలు(India Two Olympic medals) అందించాడు. 2020లో టోక్యోలో జరిగిన విశ్వ క్రీడల్లో బంగారం పతకం సాధించి నీరజ్ చరిత్ర సృష్టించాడు. అథ్లెటిక్స్(Athletics) విభాగంలో బంగారు పతకం(Gold Medal) సాధించిన తొలి భారతీయుడిగా నిలిచాడు. ఆ సమయంలో ఆయన 87.58 మీటర్ల దూరం బల్లెం విసిరాడు. 2024లో పారిస్లో జరిగిన ఒలింపిక్స్లో భారీ అంచనాలతో బరిలోకి దిగిన నీజర్ రజత పతకం(Silver medal)తో సరిపెట్టుకున్నాడు. ఈ ఈవెంట్లో నీరజ్ 89.45 మీటర్ల దూరం జావెలిన్ విసిరాడు. అయితే పాకిస్తాన్ ప్లేయర్ అర్షద్ 92.97 మీటర్లు విసిరి ఆ పోటీల్లో బంగారు పతకం సాధించాడు. అయితే తాజాగా నీరజ్ తన కెరీర్లో తొలిసారి 90 మీటర్లు కంటే ఎక్కువ దూరం జావెలిన్ను విసిరాడు.