అక్షరటుడే, హైదరాబాద్: Navodaya schools : తెలంగాణలో 7 నవోదయ విద్యాలయాలు ప్రారంభంకానున్నాయి. ఈ మేరకు నవోదయ విద్యాలయ అధికారులతో తెలంగాణ విద్యాశాఖ(Telangana Education Department) అధికారులు సమావేశమై చర్చించారు. ప్రారంభానికి సంబంధించిన ఏర్పాట్లపై సమీక్షించారు. తుది నిర్ణయం ప్రకటించారు.
కొత్తగా మంజూరు చేయబడిన(7) JNVలు – భద్రాద్రి కొత్తగూడెం(Bhadradri Kothagudem), జగిత్యాల(Jagityala), మహబూబ్ నగర్(Mahabubnagar), మేడ్చల్-మల్కాజ్ గిరి(Medchal-Malkaj Giri), నిజామాబాద్(Nizamabad), సంగారెడ్డి(Sangareddy), సూర్యాపేట(Suryapet)లో ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు వీటి ఏర్పాటును ప్రణాళిక ప్రకారం పూర్తి చేయాలని అధికారులు నిర్ణయించారు. జులై 14, 2025 నుంచి తరగతులు ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.