అక్షరటుడే, ఇందూరు: Navodaya Vidyalaya | నిజామాబాద్ జిల్లాకు నూతనంగా మంజూరైన జవహర్ నవోదయ విద్యాలయంలో ఈ విద్యా సంవత్సరం నుంచి తరగతులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితా రాణా (Education Secretary Yogita Rana) సూచించారు. పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు నరసింహారెడ్డితో (Director of Education Narasimha Reddy) కలిసి గురువారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
Navodaya Vidyalaya Nizamabad | ప్రతిపాదనలు పంపాలి
ఈ సందర్భంగా యోగితా రాణా మాట్లాడుతూ.. నవోదయ విద్యాలయాలకు శాశ్వత ప్రాతిపదికన భవన నిర్మాణ కోసం అనుకూలమైన స్థలాన్ని గుర్తించాలన్నారు. ఇప్పటికే స్థల సేకరణ పూర్తయిన జిల్లాల్లో భవన నిర్మాణాలకు చొరవ చూపాలని సూచించారు. శాశ్వత భవనాలు సమకూరేవరకు అందుబాటులో ఉన్న తాత్కాలిక భవనాల్లో తరగతులు ప్రారంభించాలన్నారు. తరగతి గదులు, నీటి వసతి, టాయిలెట్ వసతులు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. మరమ్మతులు, ఫర్నిచర్ వంటి వాటికోసం ప్రతిపాదనలు పంపితే నిధులు మంజూరు చేస్తామన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు (Collector Rajiv Gandhi Hanumanthu), డీఈవో అశోక్ nizamabad deo ashok, పంచాయతీరాజ్ ఈఈ శంకర్ తదితరులు పాల్గొన్నారు.