అక్షరటుడే, ఇందూరు: Nizamabad City | కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జాతీయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో 9న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చినట్లు మున్సిపల్ కార్మిక సంఘాల జేఏసీ నాయకులు తెలిపారు. మంగళవారం ఏఐటీయూసీ (AITUC), సీఐటీయూ (CITU), టీయూసీఐ (TUCI) నాయకులు నగరపాలక సంస్థ కార్యాలయంలో (Municipal Corporation Office) సమ్మె నోటీసులను అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం కార్మికులను విస్మరిస్తోందన్నారు. కనీస వేతనాల అమలు, పనిగంటల పెంపుదలకు వ్యతిరేకంగా సమ్మె నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాలోని కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి ఓమయ్య, టీయూసీఐ జిల్లా కార్యదర్శి సుధాకర్, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.