అక్షరటుడే, ఇందూరు: Nizamabad Collector | మాదకద్రవ్యాల నిర్మూలనలో భాగంగా ఈనెల 20 నుంచి 26 వరకు నషా ముక్త్ భారత్ అభియాన్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) తెలిపారు. ఈ మేరకు కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు. శుక్రవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. డ్రగ్స్ రహిత జిల్లా లక్ష్యంగా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. డ్రగ్స్ వల్ల నష్టాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. విద్యాసంస్థల్లో మాదకద్రవ్యాల నిరోధక కమిటీలు బలోపేతం చేయాలన్నారు. 25న మాదకద్రవ్యాల నియంత్రణ అంశంపై విద్యార్థులకు పోటీలు నిర్వహించాలని ఆదేశించారు. అనంతరం మాదకద్రవ్యాల నిర్మూలన పోస్టర్లు ఆవిష్కరించారు. సమావేశంలో జిల్లా సంక్షేమాధికారిణి రసూల్ బీ, అదనపు డీసీపీ బస్వారెడ్డి, తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో నిజామాబాద్ జోన్ డీఎస్పీ సోమనాథం, డీఎంహెచ్ఓ రాజశ్రీ, డీఐఈవో రవికుమార్ పాల్గొన్నారు.
Nizamabad Collector | నషా ముక్త్ భారత్ అభియాన్ ను విజయవంతం చేయాలి
Published on
