అక్షరటుడే, వెబ్డెస్క్: MS Dhoni | పాకిస్థాన్తో యుద్ధం నేపథ్యంలో భారత సైన్యానికి టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (team india former captain mahendra singh dhoni) సాయం అందించనున్నాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. భారత ప్రాదేశిక సైన్యంలో ధోనీ గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ (lieutenant colonel) హోదా కలిగి ఉన్నాడు. అసవరమైతే అతను సైన్యంతో కలవనున్నాడు. పాక్తో యుద్ధం నేపథ్యంలో భారత సైన్యానికి (indian army) సాయం అందించాలంటూ ప్రాదేశిక సైన్యానికి పిలుపు అందింది. ఈ మేరకు రక్షణ మంత్రిత్వ శాఖ (ministry of defense) గెజిట్ జారీ చేసింది.
ప్రాదేశిక సైన్యం సేవలను ఉపయోగించుకునేందుకు భారత సైనిక అధ్యక్షుడికి (Indian army chief) పూర్తి అధికారం ఉందని పేర్కొంది. గతంలో కూడా ప్రాదేశిక సైనిక సేవలను భారత సైన్యం ఉపయోగించుకుంది. ఆపరేషన్ పరాక్రమ్ (operation parakram), కార్గిల్ యుద్ద (kargil war) సమయంలో ప్రాదేశిక సైన్యం.. భారత సైన్యానికి అండగా నిలిచింది. ఈ ప్రాదేశిక సైన్యంలో ధోనీతో పాటు దిగ్గజ కెప్టెన్ కపిల్ దేవ్, మాజీ కేంద్ర మంత్రి సచిన్ పైలెట్ (dhoni, kapil dev and former central minister schin pilot) ఉన్నారు. ప్రాదేశిక సైన్యం అనేది స్వచ్ఛంద పౌరులతో కూడిన సైనిక సంస్థ. దేశానికి అవసరమైనప్పుడు భారత సైన్యానికి అండగా నిలిచేందుకు శిక్షణ పొందుతారు.
క్రికెట్కు చేసిన సేవలకు గుర్తింపుగా 2011లో మహేంద్ర సింగ్ ధోనీకి (mahendra singh dhoni) 2011లో భారత ప్రాదేశిక సైన్యం గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ (india territorial army Lieutenant Colonel) హోదాను ప్రదానం చేసింది. ఆ తర్వాత ధోనీ పారాట్రూపర్ శిక్షణ కూడా తీసుకున్నాడు. ఆర్మీ హెడ్క్వార్టర్స్ (army head quaters) అనుమతి కశ్మీర్ లోయలో 15 రోజుల పాటు పెట్రోలింగ్, గార్డ్, పోస్ట్ డ్యూటీ వంటి విధులు నిర్వర్తించాడు. ధోనీ తరహాలోనే క్రికెట్కు చేసిన సేవలకు గుర్తింపుగా కపిల్ దేవ్కు (kapil dev) కూడా భారత ప్రాదేశిక సైన్యంలో గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదా దక్కింది. మాజీ కేంద్ర మంత్రి సచిన్ పైలెట్ (former central minister sachin pilot) మాత్రం అధికారిగా చేరి.. కెప్టెన్ హోదాలో కొనసాగుతున్నారు.