అక్షరటుడే, ఆర్మూర్ : Mla Prashanth reddy | రెండుసార్లు ఎంపీగా గెలిచిన అర్వింద్ (Mp Arvind) జిల్లా ప్రజలకు చేసింది ఏమీ లేదని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కేసీఆర్ (KCR), కేటీఆర్, కవిత, హరీష్రావుపై అర్వింద్ చేసిన అనుచిత వ్యాఖలను తీవ్రంగా ఖండించారు. తెలంగాణ రాష్ట్రం సాధించిన గొప్ప వ్యక్తిని విమర్శించడానికి అర్వింద్కు అర్హత, స్థాయి లేదన్నారు.
మోదీని చూసి ప్రజలు ఓట్లేస్తున్నారని, ఎంపీ అర్వింద్ను చూసి వేయట్లేదని ఎద్దేవా చేశారు. 71ఏళ్లు ఉన్న కేసీఆర్ను ముసలివాడు అంటే 74 ఏళ్లు ఉన్న పీఎం మోదీని ఏమనాలని ప్రశ్నించారు. అర్వింద్ మాట్లాడిన దిగజారుడు మాటలు ఆయన స్థాయిని సూచిస్తున్నాయన్నారు. ఐదు దశాబ్దాలుగా ప్రజాసేవలో ఉండి, చావు నోట్లో తలపెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన గొప్ప వ్యక్తి కేసీఆర్ను విమర్శించడానికి ఎంపీ అర్వింద్కు ఏమాత్రం అర్హత, స్థాయి లేదని స్పష్టం చేశారు.