More
    HomeజాతీయంVrindavan | కోతి భ‌లే ప‌ని చేసిందిగా… రూ.20 లక్షల విలువైన నగల పర్సు ఎత్తుకెళ్లి..!

    Vrindavan | కోతి భ‌లే ప‌ని చేసిందిగా… రూ.20 లక్షల విలువైన నగల పర్సు ఎత్తుకెళ్లి..!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Vrindavan | ఈ మ‌ధ్య కోతుల సంఖ్య బాగా పెరిగింది. కోతులు బెడ‌ద ప‌ల్లెల్లోనే కాదు ప‌ట్ట‌ణాల‌లోనూ ఎక్కువే. అయితే కొన్ని కోతులు మ‌నుషుల‌పై దాడి చేయ‌డం, లేదంటే మ‌న చేతుల్లో ఉన్న‌వి ఎత్తుకెళ్ల‌డం వంటివి చేస్తున్నాయి. తాజాగా ఓ కోతి ఏకంగా రూ.20 ల‌క్ష‌ల విలువైన న‌గ‌ల ప‌ర్సు(Purse) ఎత్తుకెళ్లి కాసేపు భ‌యాందోళ‌న‌కు గురి చేసింది. వివ‌రాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh)లోని మధుర జిల్లాలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం వృందావన్‌లో శుక్రవారం ఈ సంఘ‌ట‌న‌ చోటుచేసుకుంది. ప్రఖ్యాత ఠాకూర్ బాంకే బిహారీ ఆలయ సమీపంలో ఓ భక్తురాలి వద్ద నుంచి కోతి సుమారు రూ.20 లక్షల విలువైన బంగారు ఆభరణాలు ఉన్న పర్సును లాక్కెళ్లింది.

    2025 జూన్ 6న వృందావన్‌ నగరంలోని ప్రసిద్ధ ఠాకూర్ బాంకే బిహారీ ఆలయం(Thakur Banke Bihari Temple)కి యూపీలోని అలీఘర్‌కు చెందిన అభిషేక్ అగర్వాల్ తన కుటుంబంతో ఆలయ దర్శనానికి వచ్చారు. దర్శనం ముగించుకుని తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. అకస్మాత్తుగా ఓ కోతి అభిషేక్ అగర్వాల్ (Abhishek Agarwal) భార్య చేతిలో ఉన్న పర్సును లాక్కెళ్లింది. ఆ పర్సులో సుమారు రూ.20 లక్షల విలువైన బంగారు ఆభరణాలు ఉన్నాయని బాధితులు తెలిపారు. ఈ ఘటనపై వెంటనే స్పందించిన పోలీసులు, స్థానికుల సహకారంతో పరిసరాలను గాలించగా, కొన్ని గంటల వెతుకులాట త‌ర్వాత‌ సమీపంలోని ఓ పొదలో పర్సును గుర్తించారు.

    READ ALSO  Assam CM | అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ కీలక నిర్ణయం.. ట్రాన్స్‌జెండర్లకు OBC హోదా ప్రకటన

    అదృష్టవశాత్తూ, పర్సులోని ఆభరణాలు అన్నీ భద్రంగా ఉండ‌డంతో వారు ఊపిరి పీల్చుకున్నారు. ఇక పోలీసులు(Police) వాటిని అభిషేక్ అగర్వాల్ కుటుంబానికి అప్పగించడంతో వారు ఆనందం వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో కోతుల వల్ల తలెత్తే స‌మ‌స్య‌లు అంతా ఇంతా కాదు. ఈ ఏడాది మొదట్లో శ్రీ రంగనాథ్ జీ మందిరం(Shri Ranganath Ji Temple) వద్ద ఓ భక్తుడి ఐఫోన్‌ను కోతి ఎత్తుకెళ్లిన ఘటన నవ్వులు తెప్పించగా, తాజా సంఘటన మాత్రం భయానకమైన అనుభవంగా మిగిలింది. అయితే యూపీలోని వృందావ‌న్ గుడిలో ఓ వ్య‌క్తి చేతుల్లోంచి ఖ‌రీదైన ఐఫోన్(iPhone) ఎత్తుకెళ్లింది. శ్రీ రంగ‌నాథ్ జీ మందిర్ గోడ‌పై కూర్చున్న ఆ కోతి త‌న చేతుల్లోని ఫోన్ ఇచ్చేందుకు నిరాక‌రించింది. ఇక ఆ కోతిని ఒప్పించేందుకు చాలా మంది చాలా ప్ర‌య‌త్నాలు చేశారు. గోడ వ‌ద్ద గుమ్మికూడిన జ‌నం ఆ కోతి దిశ‌గా ఫ్రూటీలు విసిరారు. చివ‌ర‌కు ఓ ఫ్రూటీ ప్యాక్ అందుకున్న ఆ కోతి.. ఆ స‌మ‌యంలో త‌న చేతుల్లో ఉన్న ఫోన్‌ను వ‌దిలేసింది. కింద ఉన్న వ్య‌క్తి కోతి వ‌దిలిన ఐఫోన్‌ను చాక‌చ‌క్యంగా అందుకున్నాడు. ఈ ఘ‌ట‌న‌కు చెందిన వీడియో ఒక‌టి ఇన్‌స్టాలో పోస్టు చేయ‌గా, తెగ వైర‌ల్ అయ్యింది.

    READ ALSO  Cyber ​​Crime | రూ. 2 వేల కోట్ల సైబర్‌ మోసం.. ఏకంగా చైనాతో లింకులు!

    Latest articles

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ – 27 జూన్​ 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంవిక్రమ సంవత్సరం – 2081 పింగళఉత్తరాయణంగ్రీష్మ రుతువురోజు – శుక్రవారంమాసం – ఆషాఢపక్షం...

    Govt Employees | ఉద్యోగుల బదిలీలపై నిషేధం.. కారణం ఇదే..!

    అక్షరటుడే, హైదరాబాద్: Govt Employees : తెలంగాణ ప్రభుత్వం(Telangana state government) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగుల...

    Puri Jagannath Rath Yatra | తరిద్దాం శ్రీ కృష్ణుడి సేవలో.. నేడు పూరి జగన్నాథ రథయాత్ర

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Puri Jagannath Rath Yatra : శ్రీకృష్ణుడు(Sri Krishna) తన తోబుట్టువులతో కలిసి కొలువుదీరిన మహిమాన్విత...

    Vijay Deverakonda | సక్సెస్, డబ్బు, రెస్పెక్ట్.. ఈ మూడే కిక్ ఇచ్చేవి : విజయ్ దేవరకొండ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Vijay Deverakonda : జీవితంలో ప్రతి ఒక్కరికీ కిక్ ఇచ్చేవి సక్సెస్, మనీ, రెస్పెక్ట్ మాత్రమేనని...

    More like this

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ – 27 జూన్​ 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంవిక్రమ సంవత్సరం – 2081 పింగళఉత్తరాయణంగ్రీష్మ రుతువురోజు – శుక్రవారంమాసం – ఆషాఢపక్షం...

    Govt Employees | ఉద్యోగుల బదిలీలపై నిషేధం.. కారణం ఇదే..!

    అక్షరటుడే, హైదరాబాద్: Govt Employees : తెలంగాణ ప్రభుత్వం(Telangana state government) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగుల...

    Puri Jagannath Rath Yatra | తరిద్దాం శ్రీ కృష్ణుడి సేవలో.. నేడు పూరి జగన్నాథ రథయాత్ర

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Puri Jagannath Rath Yatra : శ్రీకృష్ణుడు(Sri Krishna) తన తోబుట్టువులతో కలిసి కొలువుదీరిన మహిమాన్విత...