అక్షరటుడే, కామారెడ్డి: Prajavani | కలెక్టర్ కార్యాలయంలో వచ్చే సోమవారం నిర్వహించే ప్రజావాణి వాయిదా వేస్తున్నట్లు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ (Collector Ashish Sangwan) తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ (Telangana State Formation Day) వేడుకల సందర్భంగా జూన్ 2న ప్రజావాణి ఉండదన్నారు. ప్రజలు తమ దరఖాస్తులను కలెక్టరేట్లోని రూం నం.25లో సమర్పించవచ్చని సూచించారు. జూన్ 9 జరిగే ప్రజావాణి కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతాయని కలెక్టర్ పేర్కొన్నారు.
