అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | రోడ్లు, భవనాల శాఖ (Roads and Buildings Department) ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్గా పి.మోహన్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న కె.రవిశంకర్కు ఎస్ఈగా పదోన్నతి రావడంతో ఆయన స్థానంలో మోహన్ను నియమించారు.
అనంతరం కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ను (Collector Ashish Sangwan) మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా రోడ్ల అభివృద్ధికి పూర్తిస్థాయిలో కృషి చేస్తానని, ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు చర్యలు తీసుకుంటానని తెలిపారు.