అక్షరటుడే, బాన్సువాడ: పేదల సంక్షేమమే ధ్యేయంగా మోదీ ప్రభుత్వం పని చేస్తోందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చినరాజులు (BJP district president Neelam Chinarajulu) పేర్కొన్నారు. బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో బుధవారం సంకల్ప సభ (Sankalpa sabha) ఏర్పాటు చేశారు. ఈ మేరకు పట్టణంలోని రామాలయంలో మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 11 ఏళ్ల కాలంలో ఆర్థిక సవాళ్లను ఎదుర్కొని భారత్ అభివృద్ధి చెందుతున్న గ్లోబల్ ఆర్థిక శక్తిగా ఎదుగుతుందన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు లక్ష్మీనారాయణ, జిల్లా కార్యదర్శి శంకర్ గౌడ్, పట్టణ అధ్యక్షుడు కోణాల గంగారెడ్డి, చిరంజీవి, ఉమేష్, రామకృష్ణ, అనిల్, గుడుగుట్ల శ్రీనివాస్, చిదుర సాయిలు, శ్రీనివాసరెడ్డి, మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.